Devakatta: అవి చెప్పకుండా చనిపోతే నా జీవితానికి అర్థమే లేదు
ABN , First Publish Date - 2021-09-09T18:32:48+05:30 IST
దేవకట్టా సక్సెస్, ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు. సినిమా సినిమాకు గ్యాప్ ఉన్నా, ముందు చిత్రం పరాజయం పాలైనా ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తారు. రాజకీయం నేపథ్యంలో సాయి తేజ్ హీరోగా ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం రిపబ్లిక్’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ రెండు కథలు చాలా ముఖ్యం
అవి చెప్పకుండా చనిపోతే నా జీవితానికి అర్థమే లేదు..
ఇకపై వరుస చిత్రాలు చేయాలనుకుంటున్నా...
దేవకట్టా సక్సెస్, ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు. సినిమా సినిమాకు గ్యాప్ ఉన్నా, ముందు చిత్రం పరాజయం పాలైనా ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తారు. రాజకీయం నేపథ్యంలో సాయి తేజ్ హీరోగా ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం రిపబ్లిక్’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన దగ్గర 6–7 కథలు సిద్ధంగా ఉన్నాయని, అందులో రెండు అద్భుతమైన కథలున్నాయని, ఆ కథలను తెరపై చెప్పకుండా చనిపోతే దర్శకుడిగా జీవితానికి అర్థం లేకుండా పోతుందని ఆయన అన్నారు. ఆ భయం వెంటాడుతోందని అంటున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ుూ నేను కథలన్నీ ఇతర కథలకు భిన్నంగానే ఉంటాయి. రొటీన్ భిన్నంగా ఆలోచించడం నాకు మొదటి ఉంచి అలవాటు. నా తదుపరి చిత్రం రిపబ్లిక్ విడుదలైన మూడు నెలలకు ప్రారంభిస్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా సక్సెస్ అవ్వడం కన్నా ఓటీటీ విడుదల గురించే ఎక్కువ సమస్య ఎదురవుతుంది. అందుకే రానున్న నాలుగైదేళ్లు వరుస చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం నా దగ్గరున్న కథల్లో రెండు బలమైన కథలున్నాయి. అవి తప్పకుండా చెప్పాల్సినవి.. ప్రేక్షకులు చూడాల్సినవి. ఆ రెండు కథలు చెప్పకుండా చనిపోతే దర్శకుడిగా నా జీవితానికి అర్థమే లేదు. ఓ టీనేజ్ కథరాశాను. దానితోపాటు 17ఏళ్ల యువతి జీవితం 45 ఏళ్ల వయసు వరకూ ఆమె జీవితం ఎలా సాగింది అన్న కథాంశంతో మరో కథ ఉంది. అలాగే ముంబై మాఫియా నేపథ్యంలో ఓ కథ రాశా. ఇవన్నీ త్వరలో ప్రజలకు చెప్పాలనుకుంటున్నా’’ అని దేవకట్టా అన్నారు.