SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక

ABN , First Publish Date - 2023-03-27T21:15:59+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు SSMB28 నిర్మాత సూర్యదేవర నాగవంశీ హెచ్చరించారు. ఫ్యాన్స్ ఊహించని విధంగా.. సర్‌ప్రైజ్ చేసిన ఆయన.. ఇలా హెచ్చరిక చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అయితే

SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక
SSMB28 Movie Still

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు SSMB28 నిర్మాత సూర్యదేవర నాగవంశీ హెచ్చరించారు. ఫ్యాన్స్ ఊహించని విధంగా.. సర్‌ప్రైజ్ చేసిన ఆయన.. ఇలా హెచ్చరిక చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఆయన చేసిన హెచ్చరిక వెనుక అర్థం లేకపోలేదు. ఈ మధ్య స్టార్ హీరోల అభిమానులు.. అప్‌డేట్స్ అప్‌డేట్స్ అంటూ నిర్మాణ సంస్థలని తెగ విసిగిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా అప్పటి నుంచి ఈ విసిగింపు మరీ ఎక్కువైంది. ఎంత అంటే.. నిర్మాణ సంస్థలను బెదిరించే స్థాయికి ఫ్యాన్స్ వెళ్లిపోయారు. స్టార్ హీరోలతో సినిమాలంటే.. నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది కాదు. సినిమా షూటింగ్ జరుగుతున్నా, సినిమా పూర్తయినా.. నిర్మాతలేం దాచుకోరు. వాళ్లకి కూడా పబ్లిసిటీనే కావాలి. కానీ, ఏం అప్‌డేట్ లేకుండా.. అప్‌డేట్స్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెట్రోగిపోతుంటే వారు మాత్రం ఏం చేస్తారు. అందుకే సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ వేదికగా ముందస్తు హెచ్చరికను జారీ చేశారు.

‘‘తాజాగా వచ్చిన SSMB28 అద్భుతమైన అప్‌డేట్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగానే ఉన్నారని భావిస్తున్నాను. దీని తర్వాత హైపర్ మాసీ అప్‌డేట్ సూపర్ స్టార్ కృష్ణగారి బర్త్‌డే‌ని పురస్కరించుకుని ‘మే’లో ఉంటుంది. అప్పటి వరకు మీరంతా ఓపికగా వేచి చూస్తారని భావిస్తున్నాను’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు కూడా ఓకే మావబ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈసారి సడెన్‌గా కాకుండా.. ఒక రోజు ముందు అనౌన్స్ చేయండి అంటూ సలహాలిస్తున్నారు. ఎందుకంటే.. తాజాగా వచ్చిన ఈ చిత్ర అప్‌డేట్‌ని మేకర్స్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విడుదల చేశారు. ఫ్యాన్స్ ఈ సర్‌ప్రైజ్‌ని ఎంజాయ్ చేయలేకపోయారు. అందుకే.. ఈసారి ఒక రోజు ముందు ప్రకటించమని కామెంట్స్‌లో తెలియజేస్తున్నారు.

Mahesh-Babu.jpg

‘అతడు, ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్ SSMB28 (వర్కింగ్ టైటిల్). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఫ్యాన్స్ అందరూ ఊహించని ఈ సర్‌ప్రైజ్ ఇచ్చినందుకు నిర్మాణ సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Jr NTR: చరణ్‌కు తారక్ బర్త్‌డే విష్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

*Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!

*Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-27T21:16:03+05:30 IST