Manamey: వెడ్డింగ్ సాంగ్తో వచ్చిన శర్వానంద్, కృతి శెట్టి
ABN , Publish Date - May 31 , 2024 | 03:40 PM
శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘మనమే’. జూన్ 7న ఈ చిత్రం థియేటర్లలోకి కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘మనమే’ మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్గా నిలవగా.. తాజాగా మేకర్స్ మూడవ సింగిల్ టప్పా టప్పా అనే వెడ్డింగ్ సాంగ్ని రిలీజ్ చేశారు.
![Manamey: వెడ్డింగ్ సాంగ్తో వచ్చిన శర్వానంద్, కృతి శెట్టి](https://media.chitrajyothy.com/media/2024/20240530/Sharwanand_f32b597ff9.jpg)
శర్వానంద్ (Sharwanand), కృతి శెట్టి (Krithi Shetty) హీరోహీరోయిన్లుగా శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్పై రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తోన్న చిత్రం ‘మనమే’ (Manamey). జూన్ 7న ఈ చిత్రం థియేటర్లలోకి కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘మనమే’ మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచారు. మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్గా నిలవగా.. తాజాగా మేకర్స్ మూడవ సింగిల్ టప్పా టప్పా (Tappa Tappa Wedding Song) అనే వెడ్డింగ్ సాంగ్ని విడుదల చేశారు.
Also Read: *Anjali: బాలయ్య నెట్టడంపై రియాక్టైన అంజలి.. ఇక ఫుల్స్టాప్ పడినట్టేనా?
ఈ పాటను ఈ సంవత్సరం పెళ్లి పాటగా మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ అందమైన పాటను విని, కలర్ విజువల్స్ చూసిన తర్వాత అందరూ దీనిని అంగీకరించక మానరు. హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab) అందరూ ఎంజాయ్ చేసే పర్ఫెక్ట్ వెడ్డింగ్ సాంగ్ని కంపోజ్ చేశారు. ప్రోగ్రామింగ్, ఆర్కెస్ట్రేషన్ అన్నీ కూడా ఈ పాటకు చక్కగా కుదిరాయి. రామ్ మిరియాల, హేశం తమ వోకల్స్తో మెస్మరైజ్ చేయగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం గుర్తుండిపోయేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట టాప్లో ట్రెండ్ అవుతోంది.
శర్వానంద్ (Sharwanand) ఈ పాటలో లైవ్లీగా కనిపించారు. అతని స్టైలింగ్, డ్యాన్స్ అలరించాయి. పాటలో గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ కనిపించారు. ఇందులో కృతి శెట్టి, కిడ్ విక్రమ్ ఆదిత్య కూడా కనిపిస్తారు. శివ కందుకూరి, అయేషా ఖాన్ పెళ్లి జంటగా కనిపించారు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్లు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Read Latest Cinema News