దీపికా పదుకోన్ ఈ రోజు తన 40వ పుట్టినరోజు  జరుపుకొంటున్నారు.

ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో దీపికా ఒకరు.

2006లో కన్నడ చిత్రం 'ఐశ్వర్య'తో ప్రారంభించారు. 'ఐశ్వర్య' ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టినప్పటికీ... ఆమెకు నిజమైన విజయం బాలీవుడ్‌లో లభించింది

2007లో షారుఖ్ ఖాన్‌తో 'ఓం శాంతి ఓం'తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌ అయ్యారు

'లవ్ ఆజ్ కల్', 'కాక్‌టెయిల్', 'యే జవానీ హై దీవానీ', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'పద్మావత్' చిత్రాలలో నటించారు

గ్లామర్, లైట్ హార్టెడ్ రోల్స్ నుంచి సీరియస్ పాత్రల వరకు తన నటనలోని అనేక కోణాలను ప్రదర్శించారు

2017లో విన్ డీజిల్‌తో 'ట్రిపుల్ ఎక్స్‌: రిటర్న్ ఆఫ్ జెండర్ కేజ్'తో హాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు దీపికా పదుకోన్

ఆ తర్వాత హాలీవుడ్‌లో ఎక్కువ చిత్రాలు చేయనప్పటికీ... ఆ సినిమా బాలీవుడ్ వెలుపల కూడా ఆమెకు మంచి ప్రజాదరణను తెచ్చిపెట్టింది

దీపికా పదుకొణె ప్రస్తుతం దేశంలోనే అత్యధిక సంపాదన కలిగిన నటీమణులలో ఒకరు

సియాసత్.కామ్ నివేదిక ప్రకారం, ఆమె అంచనా నికర విలువ సుమారు 500 కోట్ల రూపాయలు

ప్రస్తుతం 15 కోట్ల నుండి 30 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుంది