'ఇరుముడి'లో రామ్ చరణ్ స్పెషల్ కామియో?
ABN, Publish Date - Aug 18 , 2026 | 11:42 AM
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కూతురిగా కీలక పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే, సినిమా విడుదల దగ్గరపడుతున్న వేళ సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. 'ఇరుముడి' సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక క్రేజీ స్పెషల్ కామియో రోల్లో కనిపించబోతున్నారనే వార్త. ముఖ్యంగా ఈ సినిమాలోని ఫోక్ సాంగ్ 'మల్లెపూల పల్లకి'లో రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని నెట్టింట ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు, మాస్ రాజా ఫ్యాన్స్ ఈ వార్తతో ఒక్కసారిగా పండగ చేసుకున్నారు.
రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఇప్పటికే 'పెద్ది' సినిమాతో మంచి విజయాన్ని అందుకుని జోరు మీద ఉన్నారు చరణ్. అయితే, ఇటీవల ఆయన కుడి చేతి మణికట్టుకు సర్జరీ జరగడంతో, ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న వెంటనే ఆయన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'RC17' చిత్రీకరణలో పాల్గొననున్నారు. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుకుమార్ ఈ చిత్రాన్ని ఒక అల్ట్రా స్టైలిష్ అర్బన్ యాక్షన్ అడ్వెంచర్గా ప్లాన్ చేస్తున్నారని, ఈ రోల్ కోసం చరణ్ ఏకంగా 15 కిలోల వరకు బరువు తగ్గనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే... రవితేజ 'ఇరుముడి'లో రామ్ చరణ్ కామియో నిజమేనా? అంటే.. మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. చరణ్ 'ఇరుముడి' సినిమాలో గానీ, లేదా ఆ పాటలో గానీ ఎలాంటి అతిథి పాత్ర చేయడం లేదట. ప్రస్తుతం ఆయన విశ్రాంతిలోనే ఉన్నారని స్పష్టమైంది. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ కేవలం ప్రచారంలో ఉన్న రూమర్లు మాత్రమే అని తేలిపోయింది. అయితే, రామ్ చరణ్ ప్రతి ఏటా అయ్యప్ప మాల వేస్తారు కాబట్టి 'మల్లెపూల పల్లకి' సాంగ్లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఏది ఏమైనా, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో సాగే ఒక భావోద్వేగభరితమైన కుటుంబ కథాచిత్రంగా వస్తున్న 'ఇరుముడి' రవితేజ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి ఈ నెల 21న రాబోతున్న 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
కన్నీళ్లను జయించిన రాజకుమారి.. ‘అగ్నిపరీక్ష’ నుంచి బిగ్బాస్ హౌస్ వరకు!
వంటగదికే వెళ్లని సమంత మాస్టర్చెఫ్కి జడ్జ్ ఏంటి!?
అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి డేట్ వచ్చేసిందిరోయ్..