Swayambhu: అదిరిపోయే అప్‌డేట్.. ఏకంగా రూ. 8 కోట్లు

ABN , Publish Date - May 07 , 2024 | 09:55 PM

‘కార్తికేయ 2’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్ మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ 20వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నిఖిల్ లెజెండరీ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పవర్ ఫుల్ అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

Swayambhu: అదిరిపోయే అప్‌డేట్.. ఏకంగా రూ. 8 కోట్లు
Nikhil in Swayambhu

‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్ (Nikhil) మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’ (Swayambhu)తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari) దర్శకత్వంలో నిఖిల్ 20వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నిఖిల్ లెజెండరీ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. నిఖిల్ తనపాత్ర కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుంటోన్న ఫొటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పవర్ ఫుల్ అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

*AP Elections - Pawan Kalyan: సినీరంగం నుంచి ఒక్కొక్కరు బయటికొస్తున్నారు

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి టీమ్ ప్రముఖ తారాగణంతో ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. వియత్నామీస్ ఫైటర్స్‌తో సహా 700 మంది ఆర్టిస్టులపై 12 రోజుల పాటు చిత్రీకరించనున్న ఈ ఎపిసోడ్‌లో నిఖిల్ ఆశ్చర్యపరిచే స్టంట్స్ చేయనున్నారు. రెండు మ్యాసీవ్ సెట్లలో ప్రతిష్టాత్మకంగా వార్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్‌కి మేకర్స్ రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ‘స్వయంభూ’లోని మెయిన్ హైలెట్స్‌లో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఒకటని.. ఈ యాక్షన్ ఎపిసోడ్ బిగ్ స్క్రీన్ పై గొప్ప అనుభూతిని కలిగించనుందని మేకర్స్ చెబుతున్నారు. (Swayambhu Latest Update)


Swayambhu.jpg

ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో నిఖిల్ మజిల్డ్ ఫిజిక్‌తో బీస్ట్ మోడ్‌లో ఫైటింగ్ రింగ్‌లోకి దిగుతున్నట్లుగా కనిపించారు. ఈ పాత్ర కోసం పూర్తిగా మేకోవర్‌ అయిన నిఖిల్ ఒక లెజెండరీ యోధుడిగా కనిపిస్తున్నారు. సెటప్, భారీ జనసమూహం ఫైట్ సీక్వెన్స్ గ్రాండియర్‌ని సూచిస్తున్నాయి. సంయుక్త (Samyuktha), నభా నటేష్ (Nabha Natesh) హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక, నిర్మాణ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 07 , 2024 | 09:55 PM