మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rudrakshapuram: ఆర్.కె. గాంధి ‘రుద్రాక్షపురం’.. రిలీజ్‌కు రెడీ

ABN, Publish Date - Apr 16 , 2024 | 05:30 PM

ఆర్.కె. గాంధి దర్శకత్వంలో మ్యాక్ వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘రుద్రాక్షపురం’. ‘మెకానిక్’ ఫేమ్ మణిసాయితేజ- వైడూర్య జంటగా నటించిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

Rudrakshapuram Movie Team

ఆర్.కె. గాంధి (RK Gandhi) దర్శకత్వంలో మ్యాక్ వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘రుద్రాక్షపురం’ (Rudrakshapuram). ‘మెకానిక్’ ఫేమ్ మణిసాయితేజ (Mani Saiteja)- వైడూర్య జంటగా నటించిన ఈ చిత్రంలో నటుడు నాగ మహేష్ (Naga Mahesh) కీలక పాత్ర పోషించగా.. ఫిల్మ్ జర్నలిస్ట్స్ సురేష్ కొండేటి, బి.వీరబాబు, ధీరజ అప్పాజీ ముఖ్య పాత్రల్లో నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌ (Rudrakshapuram Pre Release Event)ను తాజాగా హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించారు.

*Exclusive: టాలీవుడ్‌‌లోకి మరో కన్నడ సోయగం.. ఎంతందంగా ఉందో చూశారా!

ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.కె. గాంధి (Director RK Gandhi) మాట్లాడుతూ.. ‘రుద్రాక్షపురం’ సినిమా ప్రేక్షకులు ఎలా ఉండాలని అనుకుంటారో అలాగే ఉంటుంది. కచ్చితంగా అందరినీ అలరిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతగానో సహకరించారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.


ఇంకా ఈ కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, నటి - ఎన్నారై ప్రశాంతి హారతి, డిస్ట్రిబ్యూటర్స్ బాపిరాజు, గణేష్ భేరి, బోగాల సుధాకర్, ‘మెకానిక్’ దర్శకుడు ముని సహేకర్, దర్శకుడు శ్రీరాజ్ బల్లా తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ‘రుద్రాక్షపురం’ (Rudrakshapuram Movie) ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సినిమాతో హీరోగా మణిసాయితేజ మరిన్ని మెట్లు ఎక్కాలని అభిలషిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. రేఖా, రాజేశ్, అజయ్ రాహుల్, పవన్ వర్మ, శోభరాజ్, శ్రీవాణి, వెంకటేశ్వర్లు, అక్షర నీహా, ఆనంద్ మట్ట తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎం.ఎల్. రాజా - ఘంటాడి కృష్ణ - జయసూర్య బొంపెం సంగీతం అందించారు.

Updated Date - Apr 16 , 2024 | 06:04 PM