Akhanda 2: సీక్వెల్‌కు సిద్ధం.. ఎన్నికల తర్వాతే!

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:43 PM

బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ కు  ఉన్న క్రేజ్‌ వేరు. వీరిద్దరి కలయికలో వచ్చిన మాస్‌ మసాలా కంటెంట్‌  ‘సింహ’, ‘లెజెండ్‌’, ‘అఖండ’.. మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి.

Akhanda 2:  సీక్వెల్‌కు సిద్ధం.. ఎన్నికల తర్వాతే!
Nandamuri Balakrishna

బాలకృష్ణ(Balakrishna)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ కు  ఉన్న క్రేజ్‌ వేరు. వీరిద్దరి కలయికలో వచ్చిన మాస్‌ మసాలా కంటెంట్‌  ‘సింహ’, ‘లెజెండ్‌’, ‘అఖండ’.. మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. ఆ కాంబోలో సినిమా అంటే బాలయ్య అభిమానులకు పెద్ద పండగే! 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ జాబితాలో చేరింది. ఇప్పుడు వీరిద్దరి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ మీద ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 'అఖండ-2' (Akhanda-2) కూడా ఉంటుందని బోయపాటి చెప్పారు. తాజాగా ఈ చిత్రంపై ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తోంది.  ఇవి పూర్తయ్యాక ‘అఖండ2’ పై అధికారిక ప్రకటన ఉంటుంది. ‘అఖండ’లో పసిబిడ్డ.. ప్రకృతి.. పరమాత్మ.. కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లోనూ సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక  భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు’ అని అన్నారు. ఈ చిత్రం  స్క్రిప్ట్  వర్క్‌ మొదలైనట్లు బోయపాటి సన్నిహితుల ద్వారా సమాచారం.

Akhanda.jpg

ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చూస్తున్నారు. శరవేగంగా దీని షూటింగ్‌ జరుగుతోంది. ఇటీవల ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌.ను విడుదల చేయగా సూపర్‌ టాక్‌ వచ్చింది. బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు.  

Updated Date - Apr 16 , 2024 | 04:19 PM