Rudrakshapuram: ఆర్.కె. గాంధి ‘రుద్రాక్షపురం’.. రిలీజ్‌కు రెడీ

ABN , Publish Date - Apr 16 , 2024 | 05:30 PM

ఆర్.కె. గాంధి దర్శకత్వంలో మ్యాక్ వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘రుద్రాక్షపురం’. ‘మెకానిక్’ ఫేమ్ మణిసాయితేజ- వైడూర్య జంటగా నటించిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

Rudrakshapuram: ఆర్.కె. గాంధి ‘రుద్రాక్షపురం’.. రిలీజ్‌కు రెడీ
Rudrakshapuram Movie Team

ఆర్.కె. గాంధి (RK Gandhi) దర్శకత్వంలో మ్యాక్ వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘రుద్రాక్షపురం’ (Rudrakshapuram). ‘మెకానిక్’ ఫేమ్ మణిసాయితేజ (Mani Saiteja)- వైడూర్య జంటగా నటించిన ఈ చిత్రంలో నటుడు నాగ మహేష్ (Naga Mahesh) కీలక పాత్ర పోషించగా.. ఫిల్మ్ జర్నలిస్ట్స్ సురేష్ కొండేటి, బి.వీరబాబు, ధీరజ అప్పాజీ ముఖ్య పాత్రల్లో నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌ (Rudrakshapuram Pre Release Event)ను తాజాగా హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించారు.

*Exclusive: టాలీవుడ్‌‌లోకి మరో కన్నడ సోయగం.. ఎంతందంగా ఉందో చూశారా!

ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.కె. గాంధి (Director RK Gandhi) మాట్లాడుతూ.. ‘రుద్రాక్షపురం’ సినిమా ప్రేక్షకులు ఎలా ఉండాలని అనుకుంటారో అలాగే ఉంటుంది. కచ్చితంగా అందరినీ అలరిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతగానో సహకరించారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.


sai-venkat.jpg

ఇంకా ఈ కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, నటి - ఎన్నారై ప్రశాంతి హారతి, డిస్ట్రిబ్యూటర్స్ బాపిరాజు, గణేష్ భేరి, బోగాల సుధాకర్, ‘మెకానిక్’ దర్శకుడు ముని సహేకర్, దర్శకుడు శ్రీరాజ్ బల్లా తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ‘రుద్రాక్షపురం’ (Rudrakshapuram Movie) ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సినిమాతో హీరోగా మణిసాయితేజ మరిన్ని మెట్లు ఎక్కాలని అభిలషిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. రేఖా, రాజేశ్, అజయ్ రాహుల్, పవన్ వర్మ, శోభరాజ్, శ్రీవాణి, వెంకటేశ్వర్లు, అక్షర నీహా, ఆనంద్ మట్ట తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎం.ఎల్. రాజా - ఘంటాడి కృష్ణ - జయసూర్య బొంపెం సంగీతం అందించారు.

Updated Date - Apr 16 , 2024 | 06:04 PM