Natti Kumar: జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు అలా..

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:43 AM

ఈనాడు పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు ఆరోగ్యం క్షీణించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Natti Kumar: జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు అలా..
Ramoji Rao

ఈనాడు పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత రామోజీరావు (RamojiRao) మృతి పట్ల తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ (Natti Kumar) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు ఆరోగ్యం క్షీణించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇంకా ఆయన ఎంతో కాలం మన మధ్యే ఉండేవారే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన అరాచకాలు, పగలకు ఆయన మనోవేదన చెందడంవల్లే ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇప్పుడు ఏపీలో ఎన్నికల ఫలితాలు రాగానే అరాచకపాలన అంతమొందిన్న వార్తలను చూసుకున్న అనంతరమే ఆయన మనఃశాంతితో తుది శ్వాస విడిచారు.

కోకొల్లల మందికి ఆయన ఆదర్శప్రాయులు, స్ఫూర్తిప్రదాత. రామోజీ ఫిలింసిటీని నిర్మించి, చిన్న సినిమాలు కూడా షూటింగ్ చేసుకునేందుకు ఎంతగానో సహకరించారు. నేను నిర్మాతగా తొలినాళ్ళలో బండ్ల గణేష్ హీరోగా తీసిన సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ (RFC)లో చేయడానికి కారణం చిన్న సినిమాల పట్ల ఆయనకు ఉన్న ఆదరణ, పెద్ద మనస్సే. చిన్న సినిమాలు సైతం ఫిలింసిటీలో షూటింగ్ చేసుకోవచ్చని చాటి చెప్పారు. నేను ఫిలింఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఉన్నప్పుడు ఆయన అమూల్యమైన సూచనలు, సలహాలను ఇచ్చి మార్గదర్శకులుగా నిలిచారు. కొత్త వాళ్ళతో అయినా సినిమాలు తీసి, ఎంత పెద్ద హిట్ చేయవచ్చో నిరూపించారు.


Natti-Kumar.jpg

2008లో ఒకసారి ఫ్లైట్‌లో చెన్నైకి వెళుతున్నప్పుడు అదే ఫ్లైట్‌‌లో వారి పక్కన కలసి ప్రయాణించే అదృష్టం, అనుబంధం నాకు కలిగింది. ఆ సందర్భంగా వద్దు అని వారించి మరీ వారి లగేజీని వారే మోసుకుని వెళ్లడం ఆయన నిరాడంబరతకు ఒక నిదర్శనం. దర్శక, నిర్మాతలుగా దాసరి నారాయణరావుగారు, ఆయన సమకాలీకులు. కొత్త వాళ్ళను, చిన్న సినిమాలను పోటాపోటీగా తీసి, చిత్రసీమలో ఆరోగ్యకరమైన మంచి సినిమాల సృష్టికర్తలుగా నిలిచిపోయారు. నిజాయితీగా వార్తలను ఉన్నది ఉన్నట్లుగా ప్రెజంట్ చేశారు. (Media Mogul Ramoji Rao)

ఉదయం ఐదు గంటలకే ప్రపంచం నలు చెరగులా పేపర్‌ను అందించడంతో పాటు ఈటీవీని సైతం ప్రజల చెంతకు చేర్చి, చైతన్యాన్ని నింపారు. పత్రికలలో వార్తలకు సంబంధించిన భాష ఎలా ఉండాలో తన ఈనాడులో రాసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన రామోజీరావు గారు లేని లోటు తీర్చలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని నట్టి కుమార్ పేర్కొన్నారు. (RIP Ramoji Rao Sir)

Updated Date - Jun 08 , 2024 | 10:43 AM