Ramoji Rao Death: రామోజీ రావుకి  'గేమ్ ఛేంజర్' టీమ్ అశ్రు నివాళి 

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:16 AM

ఈరోజు తెల్లవారుజామున మరణించిన ఈనాడు గ్రూప్స్ చైర్మన్ రామోజీరావుకి  'గేమ్ ఛేంజర్'  చిత్ర బృందం సెట్లో నివాళి అర్పించింది.

Ramoji Rao Death: రామోజీ రావుకి  'గేమ్ ఛేంజర్' టీమ్ అశ్రు నివాళి 

ఈరోజు తెల్లవారుజామున మరణించిన ఈనాడు గ్రూప్స్ చైర్మన్ రామోజీరావుకి  'గేమ్ ఛేంజర్'  చిత్ర బృందం సెట్లో నివాళి అర్పించింది. రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకొంటున్న చిత్ర బృందానికి ఈ వార్త తెలియగానే తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్... రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు.

ఆయనతో పాటు దర్శకులు శంకర్, నటులు సునీల్ రఘు కారుమంచి ఇతర చిత్ర బృంద సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.  "పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం.అయన  మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు"  అని తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 10:46 AM