Journey To Ayodhya: చిత్రాల‌యం స్టూడియోస్ రెండో బొమ్మ ఇదే..

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:50 PM

మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వం’. ఈ సినిమా చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా రూపుదిద్దుకుంటోంది. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని తాజాగా ఈ బ్యానర్ తమ రెండో సినిమాను ప్రకటించింది. ‘జర్నీ టు అయోధ్య’ అనేది ఈ చిత్రానికి వ‌ర్కింగ్ టైటిల్. ద‌ర్శ‌కుడు వి.ఎన్‌.ఆదిత్య ఈ సినిమాకు క‌థ‌ను అందిస్తుండటం విశేషం.

Journey To Ayodhya: చిత్రాల‌యం స్టూడియోస్ రెండో బొమ్మ ఇదే..
Journey To Ayodhya Movie Pre Look

మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Sreenu Vytla) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వం’ (Viswam). ఈ సినిమా చిత్రాలయం స్టూడియోస్ (Chitralayam Studios) ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా రూపుదిద్దుకుంటోంది. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని తాజాగా ఈ బ్యానర్ తమ రెండో సినిమాను ప్రకటించింది. జగదభిరాముడు, సకల గుణధాముడు.. ధర్మ రక్షకుడు, ఏకపత్నివ్రతుడైన అయోధ్య రామయ్యను స్మరిస్తూ అనంత కోటి భక్తజనం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ శ్రీరామనవమి ప‌ర్వ‌దినాన‌ ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్ వేణు దోనేపూడి త‌న చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2ను అనౌన్స్ చేశారు. ‘జర్నీ టు అయోధ్య’ (Journey To Ayodhya) అనేది ఈ చిత్రానికి వ‌ర్కింగ్ టైటిల్. ద‌ర్శ‌కుడు వి.ఎన్‌.ఆదిత్య (VN Adithya) ఈ సినిమాకు క‌థ‌ను అందిస్తుండటం విశేషం.

*ఎన్టీఆర్ మొట్టమొదట రాముడి వేషం వేసింది తెలుగు సినిమాలో కాదు, తెలుసా!


రామాయ‌ణంపై, రామాయ‌ణంను ఆధారంగా చేసుకుని ఇప్ప‌టికే చాలా సినిమాలు వ‌చ్చాయి. ఎంద‌రో గొప్ప గొప్ప న‌టీన‌టులు సీతా రాములుగా, రావ‌ణ‌, ల‌క్ష్మ‌ణ‌, ఆంజ‌నేయులుగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడదే బాట‌లో రామాయ‌ణంను తెర‌కెక్కించ‌టానికి నిర్మాత వేణు దోనేపూడి (Venu Donepudi) సిద్ధ‌మ‌య్యారు. వి.ఎన్‌.ఆదిత్య‌ నేతృత్వంలో ఒక‌ టీమ్ ఈ చిత్రానికి సంబంధించి అయోధ్య స‌హా ప‌లు చోట్ల‌ లోకేషన్స్ రెక్కీ నిర్వహిస్తున్నారని.. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయని నిర్మాత వేణు దోనేపూడి చెబుతున్నారు.


Venu.jpg

ఒక యంగ్ డైరెక్ట‌ర్ డైరెక్షన్ చేయబోతోన్న ఈ సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, భారీగా నిర్మించబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి నిర్మాణ సారధ్యం తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja). ప్ర‌స్తుతం చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ పీపుల్ మీడియా బ్యాన‌ర్‌ (People Media Factory)తో క‌లిసి తెరకెక్కిస్తోన్న ‘విశ్వం’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Updated Date - Apr 17 , 2024 | 04:17 PM