Adipurush: గందరగోళం‌గా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక.. పోలీసుల తీరుపై నిర్వాహకులు అసహనం

ABN , First Publish Date - 2023-06-06T20:23:50+05:30 IST

తిరుపతిలో జరుగుతున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గందరగోళం నెలకొంది. లెక్కకు మించి అభిమానులు రావడంతో పాటు.. ఆ వచ్చిన వారు తమకు కేటాయించిన ప్లేస్‌లలో కాకుండా.. విఐపీ ఏరియాలోకి చొచ్చుకు రావడంతో.. మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహించడంతో నిర్వాహకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Adipurush: గందరగోళం‌గా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక.. పోలీసుల తీరుపై నిర్వాహకులు అసహనం
Adipurush Pre Release Event

భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహిస్తున్నట్లుగా ‘ఆదిపురుష్’ (Adipurush) మేకర్స్ చెబుతూ వచ్చారు. అవి కేవలం మాటలకే పరిమితం అయినట్లుగా ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ వేడుక ఉంది. అభిమానులు భారీగా తరలిరావడంతో ఈ వేడుక గందరగోళంగా మారినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన ఈ వేడుకకు లెక్కకు మించి అభిమానులు రావడంతో.. చేసేది లేక పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహిస్తున్నట్లుగా సమాచారం.

Prabhas.jpg

ముఖ్యంగా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. అదుపు తప్పి యువకులు లోనికి చొచ్చుకు వచ్చేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఈవెంట్‌లో ఎంట్రీకి వీఐపీల కోసం అయోధ్య గ్యాలరీ (Ayodhya Gallery), ఆ తరువాత పంచవటి (Panchavati), కిష్కింద గ్యాలరీ (Kishkinda Gallery)లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అయోధ్య గ్యాలరీలోకి స్టేడియం గోడలు దూకి కిష్కంద గ్యాలరీ వీక్షకులు చొచ్చుకు వచ్చేయడంతో.. అయోధ్య గ్యాలరీ పూర్తిగా జనాలతో నిండిపోయింది. దీంతో అయోధ్య గ్యాలరీ పాసులు ఉన్నవారిని లోపలకు పంపకుండా పోలీసులు ఆపేశారు.

Adipurush Pre Release Event.jpg

పోలీసులు అలా ఆపేయడంతో.. స్టేడియం బయట, వీఐపీ గ్యాలరీలలో మహిళలు (Ladies) తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నట్లుగా సమాచారం. దురుసుగా వ్యవహరిస్తున్న యువకులను తోసుకుని బయటకు రాలేక.. లోపల ఉండలేక.. ‘ఎందుకొచ్చాంరా బాబు ఈ వేడుకకు’ అనేలా మహిళలు అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదంతా చూస్తున్న పోలీసుల కూడా ప్రేక్షక పాత్ర వహించడంతో.. వేదికపై నుంచి నిర్వాహకులు మైకులోనే తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించి.. గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Global Star Prabhas) మరియు కృతి సనన్ (Kriti Sanon) నటించిన ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*#MenToo: మే 26న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. అప్పుడే ఓటీటీలోకి!

*BoyapatiRAPO: రామ్‌తో శ్రీలీల.. ఫొటోలు వైరల్

*Pregnant: పెళ్లయి 3 నెలలు.. అక్టోబర్‌లో బేబీ అంటూ నటి చేసిన పోస్ట్ వైరల్

*NBK108: బాలయ్య బర్త్‌డే‌కి ట్రీట్ అదిరిపోనుంది

*Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ కోసం భారీగా.. ‘సెట్’ చేస్తున్నారు

Updated Date - 2023-06-06T21:59:11+05:30 IST