సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Orange: జనసేనాని చేతికి ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్‌ ఆదాయం

ABN, First Publish Date - 2023-05-19T15:40:43+05:30

ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ అయిన ‘ఆరెంజ్’ చిత్రానికి వచ్చిన ఆదాయాన్ని తాజాగా జనసేన పార్టీకి మద్దతుగా అందజేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు చెక్కు రూపంలో ఈ మొత్తం అందజేశారు. ఈ సందర్భంగా

Pawan Kalyan with Orange Re Release Supporters
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంజనా ప్రొడక్షన్స్ (Anjana Productions) పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) నిర్మించిన ‘ఆరెంజ్’ (Orange) చిత్రాన్ని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ (Global Star Ram Charan) పుట్టినరోజుని పురస్కరించుకుని ఇటీవల రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ అయిన ఈ చిత్రానికి వచ్చిన ఆదాయం రూ. 1.05 కోట్లను తాజాగా జనసేన పార్టీకి మద్దతుగా అందజేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు చెక్కు రూపంలో ఈ మొత్తం అందజేశారు. ఈ సందర్భంగా ‘ఆరెంజ్’ చలన చిత్రం రెండవ సారి విడుదల చేసి ప్రదర్శించేందుకు కీలక భూమిక పోషించిన సాయి రాజేష్, ధర్మేంద్ర, ఎస్.కే.ఎన్., శివచెర్రీ, శ్రీనాథ్, ఉమా నాగేంద్ర, శ్రీధర్ తదితరులను పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నాగబాబు (Nagababu) ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుత్తం ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్‌లో వచ్చిన ఆదాయాన్ని జనసేనానికి అందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘ఆరెంజ్’ సినిమా రిలీజ్‌కు ముందు మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యేకంగా ఓ వీడియోని విడుదల చేసి.. ఈ సినిమా రీ రిలీజ్‌లో వచ్చే ప్రతి రూపాయి జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్లుగానే సినిమా విడుదలకు అయిన ఖర్చులు మొత్తం పోనూ.. వచ్చిన రూ. 1.05 కోట్ల ఆదాయాన్ని తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్‌కు వారు అందచేశారు.

ఇక రీ రిలీజ్‌లో ‘ఆరెంజ్’ సినిమా ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేసిందో తెలియంది కాదు. ఇంతకు ముందు ఉన్న రీ రిలీజ్ సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ.. ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో థియేటర్లలో దుమ్మురేపింది. వాస్తవానికి ఈ సినిమా విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. రీ రిలీజ్‌లో మాత్రం.. చిత్రయూనిట్ ఆశ్చర్యపోయేలా ఆదరణను చూరగొంది. కొందరు ఫ్యాన్స్ అయితే.. ఈ సినిమాకు సీక్వెల్ తీయాల్సిందిగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar)కు, నిర్మాత నాగబాబుకు రిక్వెస్ట్‌ చేయడం విశేషం. మొత్తంగా అయితే.. రీ రిలీజ్‌లో ‘ఆరెంజ్’ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా రీ రిలీజ్ అవుతుండటంతో.. చరణ్ బర్త్‌డేకి గీతా ఆర్ట్స్ వారు రీ రిలీజ్ చేయాలనుకున్న ‘మగధీర’ (Magadheera)ను కూడా వాయిదా వేశారు. మంచి ఆకేషన్‌ను చూసుకుని.. ‘మగధీర’ను మళ్లీ రీ రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Pan India Stars: ఒకే స్టేజ్‌పై పవన్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఎందుకో తెలిస్తే..!

*V Vijayendra Prasad: సీఎం కేసీఆర్‌ మిరాకిల్ క్రియేట్ చేశారు.. తెలంగాణ బిడ్డగా హ్యాపీ!

*Lal Salaam: క్రికెట్ లెజెండ్‌తో యాక్టింగ్ లెజెండ్.. పిక్ బహుత్ అచ్చా హై!

*Liger: ‘లైగర్’ ఎగ్జిబిటర్స్ దీక్ష విరమించారు.. ఎందుకో తెలుసా?

*Bro: ఫైనల్‌గా ‘PKSDT’ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదిరింది

*Mrunal Thakur: వామ్మో.. ఈమె అసలు ‘సీతా రామం’ సీతేనా? ఆ ప్రదర్శన ఏంటసలు?

Updated Date - 2023-05-19T15:40:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!