Sharwanand: మే ఎండింగ్‌లో.. జైపూర్‌లో పెళ్లి అనుకున్నారు కానీ..?

ABN , First Publish Date - 2023-05-16T18:22:56+05:30 IST

నిశ్చితార్థం జరిగి దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా.. ఇంకా శర్వానంద్, రక్షితారెడ్డిల పెళ్లికి సంబంధించి ఎటువంటి సమాచారం రాకపోవడంతో .. రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే..

Sharwanand: మే ఎండింగ్‌లో.. జైపూర్‌లో పెళ్లి అనుకున్నారు కానీ..?
Sharwanand and Rakshita Reddy

హీరో శర్వానంద్‌ (Sharwanand)కు, యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న రక్షితారెడ్డి (Rakshita Reddy)కి జనవరి 26న నిశ్చితార్థం (Engagement) జరిగిన విషయం తెలిసిందే. అయితే నిశ్చితార్థం జరిగి దాదాపు 4 నెలలు కావస్తున్నా.. శర్వానంద్ పెళ్లికి (Sharwanand Marriage) సంబంధించి ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో.. ఇండస్ట్రీలో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఎంగేజ్‌మెంట్‌తోనే వీరి వివాహానికి బ్రేకులు పడ్డాయని, గతంలో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) విషయంలో ఎలా అయితే జరిగిందో.. సేమ్ టు సేమ్ శర్వా విషయంలోనూ అదే జరిగింది అనేలా.. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు వార్తలు అల్లేస్తున్నారు. అయితే ఈ వార్తలపై శర్వా సన్నిహితులని సంప్రదించగా.. అలాంటిదేమీ లేదు అనేలా వారు సమాధానమిచ్చారు.

Sharwanand-1.jpg

శర్వా సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఈ మే ఎండింగ్‌లో జైపూర్‌ (Jaipur)లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ (Destination Wedding)గా శర్వా, రక్షితల పెళ్లి జరగాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ పెళ్లి వాయిదా పడిందని అంటున్నారు. అందుకే ఇంత వరకు బంధువులకు కూడా ఈ పెళ్లికి సంబంధించి ఎటువంటి సమాచారం వెళ్లలేదని తెలుస్తోంది. ఫారిన్‌లో ఉన్న శర్వానంద్ సోదరి ఈ పెళ్లికి హాజరు కాలేకపోతున్నందుకుగానూ.. పెళ్లిని జూన్‌కి వాయిదా వేసినట్లుగా శర్వా సన్నిహితులు చెబుతున్నారు. మరి జూన్‌లో ముహూర్తాలు ఉంటాయా? ఉంటే వీరి పేరు బలాలకు తగిన ముహూర్తం లభిస్తుందా? వంటి ప్రశ్నలతో.. మరోసారి వారి పెళ్లి వాయిదా పడే అవకాశమే ఉందనేలా టాక్ వినిపిస్తోంది.

Sharwanand-2.jpg

మరోవైపు.. శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న చిత్రం ఫారిన్‌లో ఎక్కువ శాతం షూటింగ్ ఉండటంతో.. పెళ్లిని వాయిదా వేశారని అంటున్నారు. రీసెంట్‌గా ఈ షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌కు శర్వా వచ్చాడని, ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అసలు విషయం ఏమిటనేది మాత్రం శర్వా సైడ్ నుంచి గానీ, రక్షితారెడ్డి ఫ్యామిలీ సైడ్ నుంచి గానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రక్షితారెడ్డి విషయానికి వస్తే.. ఆమె, తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్‌ రెడ్డి (Madhusudhan Reddy) కుమార్తె. అలాగే ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (Bojjala Gopalakrishna Reddy) మనువరాలనే విషయం తెలిసిందే. జనవరిలో జరిగిన శర్వా, రక్షితారెడ్డిల నిశ్చితార్థానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, కింగ్ నాగార్జున దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Vijay Antony: చాలా రోజులు అరటిపళ్ళు తిని బతికా..

*Nikhil: అమిత్ షా నుంచి నాకూ ఆహ్వానం వచ్చింది.. కానీ?

*Tiger Nageswara Rao: ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్సయింది.. ఈ సారి వేట మామూలుగా ఉండదట!

*Anasuya: రంగమ్మత్త కాదు.. సుమతిగా బోల్డ్ క్యారెక్టర్‌లో!

Updated Date - 2023-05-16T18:25:22+05:30 IST