Mangalavaaram: ‘ఏమయ్యిందో ఏమిటో..’.. పాయల్ రాజ్‌పుత్ ఆగమాగం

ABN , First Publish Date - 2023-10-07T18:28:30+05:30 IST

‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో.. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ మరో ప్రధాన పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘ఏమయ్యిందో ఏమిటో...’ను మేకర్స్ విడుదల చేశారు.

Mangalavaaram: ‘ఏమయ్యిందో ఏమిటో..’.. పాయల్ రాజ్‌పుత్ ఆగమాగం
Mangalavaaram Movie Still

‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో.. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ (Ajmal Ameer) మరో ప్రధాన పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ. ఎం నిర్మిస్తోన్న ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలలో మేకర్స్ స్పీడ్ పెంచారు. తాజాగా ఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘ఏమయ్యిందో ఏమిటో...’ను మేకర్స్ విడుదల చేశారు.

ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ ‘గణగణ మోగాలిరా’ బీభత్సమైన ఆదరణను పొందిన విషయం తెలిసిందే పాన్ ఇండియా హిట్ ‘కాంతార’, తెలుగులో ‘విరూపాక్ష’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బి. అజనీష్ లోక్‌నాథ్ (B. Ajaneesh Loknath) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన ‘ఏమయ్యిందో ఏమిటో...’ బాణీకి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా.. హర్షిక ఆలపించారు. అందమైన గోదావరి, పల్లెటూరి నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా కనిపించారు. ‘ఆర్ఎక్స్ 100’ పాటల్లో పాయల్‌ను అందంగా చూపించిన అజయ్ భూపతి... ఈ పాటలో ఆమెను కొత్తగా చూపించారు. పాయల్ ఈ పాటలో కనిపించిన తీరు చూస్తే.. కుర్రాళ్లు ఆగమాగం అవడం ఖాయం. ఈ విషయంలో ఈ సినిమాలో ఆర్‌ఎక్స్ 100 సీక్వెల్ అని కూడా చెప్పుకోవచ్చు. దర్శకుడు అజయ్ భూపతి మొదటి పాటలో ప్రతి మంగళవారం ఒక హత్య జరుగుతుందేమో అనేలా హింట్ ఇస్తే.. ఇప్పుడు వచ్చిన ఈ పాటలో హీరోయిన్ పాయల్ జీవితంలో ప్రేమను చూపించారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Emayyindho Emito Lyrical Song)


Payal.jpg

సెకండ్ సింగిల్ విడుదల సందర్భంగా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మాట్లాడుతూ.. అజయ్ భూపతి తెరకెక్కించే పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పాట కోసం అన్నట్లు కాకుండా ఆ పాటలోనూ కథ చెబుతారు. ‘ఏమయ్యిందో ఏమిటో’ రొమాంటిక్ సాంగ్! కథలో భాగంగా, కీలక సందర్భంలో వస్తుంది. పాయల్ నేపథ్యానికి, ఈ పాటకు చాలా సంబంధం ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు వచ్చాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ ప్రకటిస్తాం. నవంబర్ 17న భారీ ఎత్తున సినిమా విడుదల చేయనున్నామని తెలిపారు. చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అందులో లవ్ కూడా ఒకటి. అజనీష్ లోక్‌నాథ్ మంచి మెలోడీ అందించారు. అంతే అందంగా పిక్చరైజ్ చేశాం. ఈ సాంగ్ తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. (Mangalavaaram Movie)


ఇవి కూడా చదవండి:

============================

*Bubblegum: సుమక్క కొడుకు హీరోగా అరంగేట్రం.. దర్శకధీరుడు ఏం చేశారంటే..

**************************************

*Pawan Kalyan: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు

*********************************

*Tiger Nageswara Rao: సైన్ లాంగ్వేజ్‌లో కూడా.. ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతోనే రవితేజ రికార్డ్

********************************

*Mad: ‘మ్యాడ్’ బొమ్మకి హిట్ టాక్.. సంతోషంలో యూనిట్..

********************************

*Mechanic: పిల్లే కాదు.. సిద్ శ్రీరామ్ పాడిన పాట కూడా జనాలకి బాగా నచ్చేసింది.. అందుకే ఎక్కేసింది

********************************

*Siddharth: తలైవా ఫోన్‌ చేశారు.. చెన్నై వచ్చాక ‘చిత్తా’ చూస్తానన్నారు

*********************************

Updated Date - 2023-10-07T18:28:30+05:30 IST