SS Rajamouli: కీరవాణిని చూసి గర్వంగా ఫీలవుతున్న రాజమౌళి.. ఈసారి ఆస్కార్ గురించి కాదులెండి..

ABN , First Publish Date - 2023-04-06T10:53:39+05:30 IST

ఈ ఏడాది టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్ కీరవాణి (MM Keeravani)కి చాలా అద్భుతమైన సంవత్సరమనే చెప్పాలి.

SS Rajamouli: కీరవాణిని చూసి గర్వంగా ఫీలవుతున్న రాజమౌళి.. ఈసారి ఆస్కార్ గురించి కాదులెండి..
SS Rajamouli about MM Keeravani

ఈ ఏడాది టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్ కీరవాణి (MM Keeravani)కి చాలా అద్భుతమైన సంవత్సరమనే చెప్పాలి. ‘ఆర్ఆర్ఆర్’‌లోని ‘నాటు నాటు’ పాటకి సినీ ప్రపంచం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’, ‘ఆస్కార్ అవార్డు’ని దక్కించుకున్నారు. అంతేకాకుండా.. ఇతర పలు అంతర్జాతీయ అవార్డులు సైతం ఆయన సొంతమయ్యాయి. అలాగే.. తాజాగా భారతదేశంలో నాలుగో అతి పెద్ద పౌర అవార్డు అయినా ‘పద్మశ్రీ’ (Padma Shri) సొంతం చేసుకున్నారు. బుధవారం (ఏప్రిల్ 5న) రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుల గురించి జనవరిలోనే ప్రకటించగా.. తాజాగా ప్రదానం చేశారు.

MM-Keeravani.jpg

కీరవాణి అవార్డు గురించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధికారిక ఖాతాలో ఓ పోస్టుని షేర్ చేశారు. అందులో.. ‘ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పద్మశ్రీని మరకతమణి కీరవాణికి ప్రదానం చేశారు. ఆయన మ్యూజిక్ కంపోజర్, గాయకుడు, లిరిసిస్ట్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పని చేశారు’ అని రాసుకొచ్చారు.


అయితే.. కీరవాణికి ఏదైనా అవార్డు వచ్చే మొదట సంతోషపడేవారిలో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఉంటారనే విషయం తెలిసిందే. అంతేకాకుండా.. కీరవాణిని రాజమౌళి ప్రేమగా పెద్దన్న అంటాడనే సంగతి కూడా అందరికీ తెలుసు. తాజాగా కీరవాణి ‘పద్మశ్రీ’ అందుకోడంపై సోషల్ మీడియాలో వేదికగా రాజమౌళి స్పందించారు. కీరవాణితో తాను దిగిన ఫొటోని షేర్ చేసిన రాజమౌళి.. దానికి.. ‘గర్వంగా ఉంది పెద్దన్న’ అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

దీంతో.. ‘ఆయనకి ఎప్పుడో ఈ అవార్డు రావాల్సింది సర్.. ఇది ఆయనకి అద్భుతమైన సంవత్సరం’.. ‘మీ ఇద్దరిని చూస్తే చాలా గర్వంగా ఉంది సర్’.. ‘ఇద్దరు లెజెండ్స్’ అంటూ రాసుకొస్తున్నారు. కొందరూ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఈ ట్వీట్‌కి స్పందిస్తూ.. ‘SSMB29’ గురించి అప్‌డేట్ ఇవ్వమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సినీ పరిశ్రమకి సంబంధించి ఇద్దరు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అందులో ఒకరు కీరవాణి కాగా.. మరొకరు బాలీవుడ్ నటి రవీనా టండన్ (Raveena Tandon). ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

Adipurush: మరోసారి చిక్కుల్లో ప్రభాస్ మూవీ.. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ..

Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?

Shilpa Shetty: పబ్లిక్‌లో హాలీవుడ్ నటుడితో ముద్దు.. 15 ఏళ్ల క్రితం కేసులో నటికి రిలీఫ్

RRR in Japan: ‘ఆర్ఆర్ఆర్’పై రాజమౌళి పోస్ట్.. అందులోనూ జక్కన్న మార్క్ చూపించాడుగా..

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-06T11:00:36+05:30 IST