Tiger 3: వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌‌ మ్యాచుల్లో ‘టైగర్ 3’ దుమారం.. టార్గెట్‌గా ఇండియా, పాక్ మ్యాచ్

ABN , First Publish Date - 2023-10-12T19:30:07+05:30 IST

ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీతో అసోసియేషన్ అయిన బిగ్గెస్ట్ మూవీ నిర్మాణ సంస్థగా యష్ రాజ్ ఫిలిమ్స్ చరిత్ర సృష్టించనుంది. వరల్డ్ కప్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్‌ అయిన స్టార్ స్పోర్ట్స్‌తో వైఆర్ఎఫ్ సంస్థ చేతులు కలిపింది. దీంతో దీపావళికి రిలీజ్ కానున్న ‘టైగర్ 3’ చిత్రాన్ని ఓ రేంజ్‌లో ప్రమోట్ చేయడానికి నిర్మాణ సంస్థ సిద్ధమైంది.

Tiger 3: వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌‌ మ్యాచుల్లో ‘టైగర్ 3’ దుమారం.. టార్గెట్‌గా ఇండియా, పాక్ మ్యాచ్
Katrina Kaif and Salman Khan in Tiger 3

ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ కప్ (Cricket World Cup) హిస్టరీతో అసోసియేషన్ అయిన బిగ్గెస్ట్ మూవీ నిర్మాణ సంస్థగా యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) చరిత్ర సృష్టించనుంది. వరల్డ్ కప్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్‌ అయిన స్టార్ స్పోర్ట్స్‌తో వైఆర్ఎఫ్ సంస్థ చేతులు కలిపింది. దీంతో దీపావళి (Diwali)కి రిలీజ్ కానున్న ‘టైగర్ 3’ (Tiger 3) చిత్రాన్ని ఓ రేంజ్‌లో ప్రమోట్ చేయడానికి నిర్మాణ సంస్థ సిద్ధమైంది. ఈ అసోసియేషన్‌తో ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ అంతా ‘టైగర్ 3’ మూవీ ప్రమోషన్స్ మారు మోగనున్నాయి. క్రికెట్ వరల్డ్ కప్‌లో జరుగుతున్న మ్యాచ్‌లన్నింటిలో వైఆర్ఎఫ్ సంస్థ ‘టైగర్ 3’ చిత్రాన్ని ప్రమోట్ చేయనుందని చిత్రయూనిట్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా ఇండియా, పాకిస్థాన్ (India and Pakistan) దేశాల మధ్య జరగబోతున్న మ్యాచ్‌లో ‘టైగర్ 3’ సినిమా ప్రమోషన్స్ దద్దరిల్లనున్నాయని టాక్. దీని కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) క్రికెట్ వరల్డ్ కప్ కో బ్రాండింగ్ ప్రోమోస్‌లో నటించటం విశేషం. ఈ ప్రోమోస్‌ను ఈ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ కీలక మ్యాచుల్లో ప్రదర్శిస్తారు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ మార్కెటింగ్‌లో ఇదే భారీ అసోసియేషన్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని చిత్రయూనిట్ చెబుతోంది.


Tiger-3.jpg

2019లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లను 500 మిలియన్స్‌కు పైగా వీక్షించారు. మరి ముఖ్యంగా 2019లో జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను అయితే 200 మిలియన్స్‌కు పైగా చూశారు. మరి 2023లో ఈ సంఖ్య మరింత భారీగా పెరగనుంది. దీన్ని టైగర్ 3 టీమ్ క్యాష్ చేసుకోనుందని సోషల్ మీడియాలో సైతం టాక్ మొదలైంది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో రూపొందుతోన్న టైగర్ 3 చిత్రాన్ని మనీష్ శర్మ (Maneesh Sharma) దర్శకత్వంలో ఆదిత్య చోప్రా (Aditya Chopra) నిర్మాణంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ (Katrina Kaif) నటించింది.


ఇవి కూడా చదవండి:

============================

*Saindhav: ‘సైంధవ్’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*******************************

*Leo: ‘లియో’కు ప్రభుత్వ సపోర్ట్.. ఇక దుమ్ము లేచి పోవడమే..

************************************

*Aadikeshava: వైష్ణవ్ తేజ్‌కు శ్రీలీల బుజ్జి బంగారమట.. ఇద్దరూ ఇరగేశారు

*********************************

*Nupur Sanon: సౌత్ సినీ ఎంట్రీ.. మా అక్క కృతి సనన్ ఏమని సలహా ఇచ్చిందంటే..

*********************************

Updated Date - 2023-10-12T19:30:07+05:30 IST