‘వసుదేవసుతం’.. కృష్ణుడిపై వస్తోన్న మరో అద్భుతమైన సినిమా!
ABN, Publish Date - Jun 24 , 2026 | 10:19 AM
రెయిన్బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను రూపొందిస్తోన్న చిత్రం ‘వసుదేవసుతం’. మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటిస్తోన్న ఈ మూవీ జూలై 10న గ్రాండ్గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.
రెయిన్బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను రూపొందిస్తోన్న చిత్రం ‘వసుదేవసుతం’ (Vasudheva Sutham). మాస్టర్ మహేంద్రన్ (Mahendran), అంబికా వాణి (Ambikavani) జంటగా నటిస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను తాజాగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తూ.. సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేస్తోంది.
ట్రైలర్ని గమనిస్తే.. ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను మేకర్స్ రూపొందించారు. ఆలయంలోని బ్రహ్మ పదార్థం కోసం శత్రు మూకలు చేసే విన్యాసాన్ని అడ్డుకునే పాత్రలో హీరో మహేంద్రన్ పాత్ర హైలెట్ అనేలా ఉంది. యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి. ‘ఆయుధం వస్తోంది’, ‘దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు’ వంటి డైలాగ్స్.. ట్రైలర్ చివర్లో గరుత్మంతుడి షాట్ వావ్ అనేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది.
ఇక ట్రైలర్ లాంచ్ వేడుకలో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. ‘వసుదేవసుతం’ కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఈ కథను నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. దర్శకుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ మూవీని ఇంత దూరం తీసుకొచ్చారు. కృష్ణుడిపై తీసిన ఈ కంటెంట్ జనాలకు నచ్చాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇలాంటి ఓ పాత్ర, సినిమా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చిత్ర నిర్మాత మీదున్న నమ్మకంతో నేను ఈ సినిమాకు అడ్వాన్స్ కూడా అడగలేదు. ఏ నటుడి నుంచి ఎంత రాబట్టుకోవాలనేది దర్శకుడు వైకుంఠ్కి బాగా తెలుసు. అంబికా వాణి చక్కగా నటించారు. జిజు కెమెరా వర్క్, మణిశర్మ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అవుతాయి. జూలై 10న వస్తోన్న మా సినిమాను చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
దర్శకుడు వైకుంఠ్ బోను (Director Vykunt Bonu) మాట్లాడుతూ.. నిర్మాతకు ముందుగా రెండు కథలు చెప్పాను. అవి బాగానే ఉన్నాయని అన్నారు. మళ్లీ ఒరిస్సాలోని ఫేమస్ టెంపుల్ బ్యాక్ డ్రాప్లో ఓ కథను రాసుకుని, ఆ కథను వినిపిస్తే.. అంతకు ముందు చెప్పిన వాటిని పక్కన పెట్టేయండని అన్నారు. మహేంద్రన్కు కథ చెప్పిన వెంటనే ఓకే అన్నారు. మణిశర్మకు కథ చెప్పాను. నచ్చితేనే చేయండని అన్నాను. కథ నచ్చడంతో వెంటనే ఆయన పని ప్రారంభించారు. మా సినిమా జూలై 10న రాబోతోంది. ఇది వన్ మెన్ షో. చివరి 45 నిమిషాలు సినిమా నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. నా మూవీ ఎవ్వరినీ నిరాశపర్చదు. అందరూ సపోర్ట్ చేయండని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత త్రినాథ్ కేశవ, హీరోయిన్ అంబికా వాణి, అజయ్ సాయి మాస్టర్ వంటి వారంతా మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ పోరాటంలో నేనూ ఒకడినై.. ప్రయాణించా: చిరంజీవి
పారితోషికం పెంచను.. నాకంటూ ఒక రోజు వస్తుంది: ఐశ్వర్య లక్ష్మి
నారా లోకేష్తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే