Rakshith Atluri: శశివదనే వస్తోంది...
ABN , Publish Date - Jun 12 , 2025 | 02:20 PM
'శశివదనే' సినిమా యేడాది క్రితమే విడుదల కావాల్సింది. ఇప్పుడు దానిని రిలీజ్ చేయడానికి నిర్మాత అహితేజ బెల్లంకొండ సిద్ధపడుతున్నారు. సినిమా విడుదలలో జాప్యం జరిగినా కంటెంట్ మాత్రం అవుట్ డేటెడ్ కాదని ఆయన చెబుతున్నారు.
రక్షిత్ అట్లూరి (Rakshith Atluri), కోమలి ప్రసాద్ (Komali Prasad) జంటగా నటించిన సినిమా 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమాను అహితేజ బెల్లంకొండ (Ahiteja Bellamkonda) నిర్మించారు. దీనికి ముందు ఆయన 'అక్షర' (Akshara) సినిమాను ప్రొడ్యూసర్ చేశారు. గత యేడాది ఫిబ్రవరి విడుదల కావాల్సిన 'శశివదనే' సినిమాను అదే యేడాది ఏప్రిల్ 19కి వాయిదా వేశారు. అయితే రిలీజ్ కు ముందు ఫీల్ గుడ్ మూవీగా చక్కని బజ్ ను సంపాదించుకున్న 'శశివదనే' ఆఖరి నిమిషంలో విడుదల కాకుండా ఆగిపోయింది. గడిచిన ఏడాది కాలంగా తాను అనుభవించిన మానసిక క్షోభకు అక్షర రూపం కల్పిస్తూ తన ఆవేదనను ఓపెన్ లెటర్ ద్వారా వ్యక్తం చేశారు నిర్మాత అహితేజ బెల్లంకొండ.
ఎవరిని నమ్మాలి, ఎవరి నమ్మకూడదు అనే విషయంలో చాలా క్లారిటీ వచ్చిందని, గత యేడాది పడిన మానసిక వేదన నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని అన్నారు. సినిమాను గ్రాండ్ గా విడుదల చేసుకోవడానికి అన్ని రకాలుగా సిద్థమైన చివరి నిమిషంలో ఊహించిన సమస్యల కారణంగా విడుదల చేయలేకపోయానని అన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగానే ఉన్నానని తెలిపారు. కాలం అన్ని గాయాలను మార్పుతుందనేది నిజమేనని, తన విషయంలోనూ అదే జరిగిందని, వాటిని తట్టుకుని తిరిగి ఇప్పుడు 'శశివదనే' చిత్రాన్ని జనం ముందుకు తీసుకు రాబోతున్నానని అన్నారు. ఆ కష్టకాలంలో చిత్రసీమలో తనకూ ఓ గాడ్ ఫాదర్ ఉండి ఉంటే బాగుండేదనే భావన కలిగిందని అన్నారు. ఈ ఒడిదుకుల సమయంలో తన భార్య గౌరీ నాయుడు తనకు ఎంతో సపోర్ట్ చేసిందని చెప్పారు. అతి త్వరలోనే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి, వీలైనంత త్వరగా 'శశివదనే' చిత్రాన్ని జనం ముందుకు తీసుకొస్తానని అహితేజ బెల్లంకొండ తెలిపారు. రక్షిత్ అట్లూరి నటించిన 'ఆపరేషన్ రావణ్' గత యేడాది విడుదల కాగా, ఈ చిత్ర కథానాయిక కోమలి ప్రసాద్ ఇటీవల వచ్చిన నాని 'హిట్ -3'లో కీలక పాత్రను పోషించింది.
Also Read: Naga Vamsi: ఊహాగానాలకు పోవద్దు.. రెండు సినిమాలపై నాగ వంశీ క్లారిటీ
Also Read: Kannappa: కంగనా బదులు కాజల్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి