Naga Vamsi: ఊహాగానాలకు పోవద్దు.. రెండు సినిమాలపై నాగ వంశీ క్లారిటీ
ABN , Publish Date - Jun 12 , 2025 | 02:07 PM
నిర్మాత నాగవంశీ (Naga vamsi) మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. అది దర్శకుడు త్రివిక్రమ్(Trivikram), తారక్ గురించి. తదుపరి త్రివిక్రమ్ చేయనున్న చిత్రాల గురించి నాగవంశీ ఆ ట్వీట్ చేశారు.
నిర్మాత నాగవంశీ (Naga vamsi) మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. అది దర్శకుడు త్రివిక్రమ్(Trivikram), తారక్ గురించి. తదుపరి త్రివిక్రమ్ చేయనున్న చిత్రాల గురించి నాగవంశీ ఆ ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్లు ఉన్నట్లు ఆ ట్వీట్లో తెలిపారు. ఒకటి వెంకటేశ్తో, రెండోది జూ.ఎన్టీఆర్తో అని క్లారిటీ ఇచ్చారు. అవి కాకుండా వచ్చే వార్తలన్నీ ఊహాగానాలే అని నాగవంశీ వెల్లడించారు. త్రివిక్రమ్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా, ప్రాజెక్ట్ ఫిక్స్ అయినా స్వయంగా తానే వెల్లడిస్తానని నాగవంశీ ట్వీట్లో పేర్కొన్నారు. వెంకటేశ్ 'నువ్వునాకునచ్చావు, '''మల్లీశ్వరి చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే అందించిన ఆయన వెంకీతో సినిమా డైరెక్ట్ చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నారు. అది ఇప్పటికీ సెట్ అయింది.
అయితే తారక్తో సినిమా ఉందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. గుంటూరు కారం చిత్రం తర్వాత త్రివిక్రమ్ కొందరు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. రామ్చరణ్, బన్నీ వంటి హీరోల పేర్లు వినిపించాయి. అందుకే ఈ రోజు నాగవంశీ ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు . అలాగే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాపై హైప్ పెంచేలా వంశీ తాజాగా ఓ ట్వీట్ చేశారు. కార్తికేయుడి పద్యాన్ని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దాంతో తారక్ పురాణాలతో కూడిన కథలో ఎన్టీఆర్ నటించనున్నారని.. ఇందులో ఆయన కార్తికేయుడిగా కనిపించనున్నారని అభిమానులు భావిస్తున్నారు.