మాగంటి కి చిత్రపరిశ్రమతో అనుబంధం
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:32 AM
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎన్నికైన మాగంటి గోపినాథ్కు చిత్ర పరిశ్రమతో కూడా అనుబంధం ఉంది. సినీ ప్రముఖులతో మంచి సంబంధాలు..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎన్నికైన మాగంటి గోపినాథ్కు చిత్ర పరిశ్రమతో కూడా అనుబంధం ఉంది. సినీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి. నిర్మాతగా నాలుగు సినిమాలు నిర్మించారు. శ్రీ సాయినాథ్ ఆర్ట్ క్రియేషన్స్ బేనర్పై సురేశ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో ‘పాత బస్తీ’ అనే సినిమాను 1995లో నిర్మించారు. అనంతరం 2000 సంవత్సరంలో ఆర్కే ఫిల్మ్స్ బేనర్పై రాజశేఖర్, కృష్ణతో ‘రవన్న’ అనే చిత్రాన్ని నిర్మించారు. 2004లో దివ్య అక్షర నాగ మూవీస్ బేనర్పై తారకరత్నతో ‘భద్రాద్రి రాముడు’, 2009లో రాజశేఖర్తో ‘ నా స్టైలే వేరు’ సినిమాలు నిర్మించారు.