Akshay Kumar: సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకుల వెంట పడ్డ బాలీవుడ్ హీరో
ABN , Publish Date - Jun 08 , 2025 | 06:45 PM
అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ తో పాటు దాదాపు బాలీవుడ్ తారాగణమంతా నటించగా తాజాగా థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందనను తెచ్చుకున్న చిత్రం హౌస్ఫుల్5.
అక్షయ్ కుమార్ (Akshay Kumar), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)లతో పాటు దాదాపు బాలీవుడ్ తారాగణమంతా నటించగా తాజాగా థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందనను తెచ్చుకున్న చిత్రం హౌస్ఫుల్5 (Housefull 5). అయితే.. సినిమా ప్రమోషన్ల విషయంతో ఎంతో భిన్నంగా ప్రవర్తించే అక్షయ్ ఈ సినిమా విషయంలోనూ అదే పద్ధతిని పాటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవల తను నటించిన హౌస్ఫుల్ 5 సినిమా నార్త్ వ్యాప్తంగా విజయవంతంగా రన్ అవుతుంది.
ఈ నేపథ్యంలో ప్రజల అభిమానుల నుంచి స్పందనను తెలుసుకోవాలనుకున్న అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఓ మాస్క్ వేసుకుని రెండు మూడు థియేటర్లకు స్వయంగా వెళ్లారు. అచ్చం మీడియా ఛానళ్లు వ్యవహరించేలాగే సాదారణ దుస్తులు ధరించి మైక్ పట్టుకుని థియేటర్ నుంచి బయటకు వచ్చే వాళ్ల ఎదుట మైక్ పెట్టి సినిమా గురించి అడిగారు. ఆ సమయంలో పబ్లిక్ కూడా కొంత మంది బావుందని తెలుపగా మరి కొంత మంది సైలెంట్గా వెళ్లి పోయారు.
ఈ హంగామా పూర్తయ్యాక కాసేపటి తర్వాత అక్కడి వారు గుర్తించే లోగా హీరో అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెల్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉంటే సినిమా విషయంలో మాత్రం నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురౌతున్నాయి. హౌస్ఫుల్5 (Housefull 5) మూవీ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్, అసభ్యకర సీన్లతో నింపేశారంటూ కామెంట్లు వస్తున్నాయి.