Yash Vs Ranabir : యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో రామాయణం
ABN , Publish Date - May 29 , 2025 | 02:30 PM
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హిందీలో తెరకెక్కుతున్న 'రామాయణం' చిత్రం రెండు భాగాలుగా జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాకోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ రంగంలోకి దిగారు.
భారతీయ సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇతిహాసిక చిత్రం ‘రామాయణం’ (Ramayana) . ప్రముఖ నటుడు, నిర్మాత రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) ఈ భారీ ప్రాజెక్టులో రావణుని పాత్రలో కనిపించబోతుండగా, రాముడిగా రణబీర్ సింగ్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్కు చెందిన ప్రఖ్యాత స్టంట్ డైరెక్టర్ గై నోరిస్ (Guy Norris) యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. గై నోరిస్ గతంలో ‘మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’ (Mad Max: Fury Road), ‘ది సుసైడ్ స్క్వాడ్’ (The Suicide Squad) వంటి హాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఆయన ‘రామాయణం’ కోసం ప్రత్యేకంగా భారతదేశానికి వచ్చి యాక్షన్ సన్నివేశాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఈ చిత్రం, భారతీయ పౌరాణిక గాథను ప్రపంచస్థాయిలో ఆవిష్కరించేందుకు రూపుదిద్దుకుంటోంది.
యశ్ ఈ సినిమాలో నటుడిగా మాత్రమే కాకుండా సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ మొదలైనప్పటి నుంచే యశ్ సృజనాత్మకంగా పూర్తిగా చొరవ చూపుతూ, ప్రతి అంశంలో భాగస్వామిగా మారారు. తాజాగా మేకర్స్ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ ఫోటోలను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తుండగా, నమిత్ మల్హోత్రాతో కలిసి యశ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మొదటి భాగం వచ్చే యేడాది దీపావళికి విడుదల కానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేస్తారు.
Also Read: Mahesh Babu: మురారి బాటలో ఖలేజా...
Also Read: Gaddar Film Awards: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలు వీరే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి