Mahesh Babu: మురారి బాటలో ఖలేజా...

ABN , Publish Date - May 29 , 2025 | 02:08 PM

ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన 'ఖలేజా' చిత్రం మే 30న కృష్ణ జయంతి సందర్భంగా రీ-రిలీజ్ అవుతోంది. ఈ సందర్బంగా ప్రీ రిలీజ్ సేల్స్ సక్సెస్ మీట్ ను నిర్మాతలు ఏర్పాటు చేశారు.

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) జన్మదినోత్సవం సందర్భంగా మే 30న మహేశ్‌ బాబు (Mahesh Babu) నటించిన 'ఖలేజా' (Khaleja) చిత్రం మరోసారి జనం ముందుకు రాబోతోంది. మహేశ్, త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో ఆ చిత్రాన్ని శింగనమల రమేశ్‌, సి. కళ్యాణ్ నిర్మించారు. ఇప్పుడు దీనిని సుబ్బారావు ప్రస్తుతం రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ సేల్స్ బాగా జరిగినందుకు హైదరాబాద్ ఎఫ్.ఎన్.సి.సి.లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.


ఈ కార్యక్రమంలో ఇద్దరు నిర్మాతలతో పాటు కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు, కమెడియన్ అలీ, సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ, 'మహేశ్ బాబు నటించిన 'పోకిరి' (Pokiri), 'మురారి' (Murari) చిత్రాలు రీ-రిలీజ్ లో మంచి విజయాన్ని అందుకున్నాయి. అదే తరహాలో 'ఖలేజా' చిత్రానికీ విడుదలకు ముందే స్పందన లభించడం ఆనందంగా ఉంది' అని అన్నారు. ఏ దేశం వెళ్ళినా అక్కడ ఖలేజా సినిమా గురించి మాట్లాడుతుంటారని, త్రివిక్రమ్, మహేశ్ ఆ సినిమా కోసం ప్రాణం పెట్టిపనిచేశారని అలి చెప్పారు. ఈ సినిమాకు ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారని ఆయన అన్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే అయిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఏసియన్ సునీల్ నారంగ్ తెలిపారు. నిజానికి మహేశ్ బాబు నటించిన 'పోకిరి, 'మురారి', 'ఒక్కడు' వంటి చిత్రాలు అప్పట్లో బాక్సాఫీస్ బరిలో చక్కని విజయాన్ని అందుకున్నాయి. అందువల్ల రీ-రిలీజ్ సమయంలోన ఆ యా చిత్రాలకు చక్కని ఆదరణ లభించింది. కానీ 'ఖలేజా' మొదటిసారి విడుదలైనప్పుడు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా... ఈ సినిమా రీ-రిలీజ్ సమయంలో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరగడం విశేషం.

Also Read: Ravi Teja: వినాయక చవితికి మాస్ జాతర

Also Read: Gaddar Film Awards: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలు వీరే...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 29 , 2025 | 02:08 PM