సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

MNV Sagar: అప్పుడు 'కాలం రాసిన కథలు' ఇప్పుడు 'బ్యాచిలర్స్ ప్రేమకథలు'

ABN, Publish Date - Jun 06 , 2025 | 05:15 PM

గత యేడాది 'కాలం రాసిన కథలు' చిత్రాన్ని రూపొందించిన ఎం.ఎన్.వి. సాగర్ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో దానికి సీక్వెల్ గా 'బ్యాచిలర్స్ ప్రేమ కథలు' సినిమాను ప్రారంభించాడు.

గీతా సింగ్ (Geetha Singh), కార్తీక్ (Karthik), కాశీ మదన్ (Kasi Madan), ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా 'బ్యాచిలర్స్ ప్రేమకథలు' (Bachelors Prema Kadhalu). ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి. సముద్ర (V. Samudra) హాజరై కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ (Veera Sankar) క్లాప్ ఇచ్చారు.


ఈ సందర్భంగా దర్శక నిర్మాత, నటుడు ఎం.ఎన్.వి. సాగర్ (MNV Sagar) మాట్లాడుతూ, 'తొలి యత్నంగా నేను 'కాలం రాసిన కథలు' (Kalam Rasina Kadhalu) మూవీని రూపొందించాను. దానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఆ ఉత్సాహతో దానికి సీక్వెల్ గా 'బ్యాచిలర్ ప్రేమకథలు' మూవీని తీస్తున్నాను. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి సోషల్ మెసేజ్ ను ఇవ్వబోతున్నాను. అలానే ఈ మూవీతోనూ నూతన నటీనటులను పరిచయం చేయబోతున్నాను. ఇదే నెలలో షూటింగ్ ను ప్రారంభించి, ఈ యేడాదిలోనూ దీనిని విడుదల చేయడానికి ప్రయత్నిస్తాను' అని అన్నారు. తన నుండి అందరూ కామెడీని ఎక్స్ ప్రెక్ట్ చేస్తారని, కానీ అందుకు భిన్నంగా ఇందులో ఎమోషనల్ క్యారెక్టర్ చేస్తున్నానని నటి గీతాసింగ్ తెలిపింది. ఈ సినిమాతో తాను సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నానని గీతా సింగ్ చెప్పింది. ఈ కార్యక్రమంలో నటుడు కార్తీక్, కాశీ మదన్, నటి ఇషాని, శ్రుతిలయ, చలానా అగ్నిహోత్రి, డి.ఓ.పి. ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

Also Read: Gautam Krishna: సోలో బాయ్ వచ్చేది ఎప్పుడంటే...

Also Read: HariHara Veeramallu: హరిహర వీరమల్లు వాయిదా.. అధికారికంగా ప్రకటించిన టీమ్ 

Also Read: NTR to Jr Ntr : డాన్ పాత్రలతో అలరించిన నందమూరి కుటుంబం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 06 , 2025 | 05:15 PM