8 Vasanthalu: కథ విని ఏడ్చేశానంటున్న అనంతిక సనీల్ కుమార్
ABN, Publish Date - Jun 14 , 2025 | 06:40 PM
మ్యాడ్ చిత్రంలో నటించిన అనంతిక సనీల్ కుమార్ లేటెస్ట్ మూవీ 8 వసంతాలు. తన మనసుకు నచ్చిన పాత్రను ఇందులో చేశానని అనంతిక చెబుతోంది.
'మ్యాడ్' (MAD) మూవీలో నటించిన అవంతిక సనీల్ కుమార్ (Ananthika Saneel Kumar) తాజా చిత్రం '8 వసంతాలు' (8 Vasanthalu). ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపుదిద్దు కుంటున్న కాన్సెప్ట్ సెంట్రిక్ మూవీని నవీన్ యర్నేని (Naveen Yarneni), వై. రవిశంకర్ నిర్మించారు. జూన్ 20న సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను మీడియాతో పంచుకుంది అనంతికా సనీల్ కుమార్.
'8 వసంతాలు' మూవీ గురించి అనంతిక మాట్లాడుతూ, 'ఇది విమెన్ కి సంబంధించిన కథ. కథలో అమ్మాయి పాత్ర కీలకం అయినప్పటికీ మిగతా పాత్రలన్నిటికీ సమానంగా ప్రాముఖ్యత వుంది. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్ కి లేయర్స్ ఉంటాయి. ఇలాంటి మంచి కథ కోసం వెయిట్ చేశాను. ఈ కథలో నేను కోరుకున్న ప్రతిదీ ఉంది. నాకు యాక్షన్, బ్యూటిఫుల్ లవ్ స్టొరీ చేయాలని ఉండేది. అవన్నీ కూడా ఈ కథలోనే కుదిరాయి. ఫర్ఫార్మెన్స్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. కథ చదివినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను. లిటరల్ గా ఏడ్చేశాను. అంత ఎమోషనల్ చెప్తున్న కథ ఇది. నేను శుద్ధి యోగ్య పాత్రలో కనిపిస్తాను. తను ఒక రచయిత. అలాగే తనకి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కూడా ఉంటుంది' అని తెలిపింది.
Also Read: Samantha: అన్నీ దాటిపోవాలి.. సమంత పోస్ట్ వైరల్
Also Read: Anirudh Ravichander: సన్ రైజర్స్ జట్టు ఓనర్ కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్