Robinhood: నితిన్, వెంకీ కుడుముల సినిమాలో శ్రీలీలకు బదులు రాశి ఖన్నా

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:53 PM

'రంగ్ దే' తరువాత నితిన్, వెంకీ కుడుముల 'రాబిన్ హుడ్' కోసం మరోసారి చేతులు కలిపారు. ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన విడుదలవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు, కానీ ఇందులో కథానాయిక ఎవరనేది మాత్రం ఇంకా చెప్పలేదు. రష్మిక మందన్న, శ్రీలీల, ఇప్పుడు రాశి ఖన్నా చేస్తోంది అంటున్నారు.

Robinhood: నితిన్, వెంకీ కుడుముల సినిమాలో శ్రీలీలకు బదులు రాశి ఖన్నా
Sreeleela, Nithiin, Raashi Khanna

నితిన్, వెంకీ కుడుముల సినిమా పేరు 'రాబిన్ హుడ్' అని ఆమద్యన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోందని భోగట్టా. ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు, ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న విడుదల చేస్తున్నామని కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రాబిన్ హుడ్ గా నితిన్ మునుపెన్నడూ లేని తరహా పాత్రలో కనిపించబోతున్నాడు అని అంటున్నారు.

అలాగే దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్ లుక్ ని ప్రత్యేకంగా ఈ సినిమా కోసమని మార్చివేస్తున్నట్టుగా తెలిసింది. ఇంతవరకు నితిన్ చెయ్యని ఒక విభిన్నమైన పాత్రలో నితిన్ ని చూపిస్తున్నాడని అంటున్నారు. అతన్ని దొంగగా పరిచయం చేసిన టీజర్ హాస్యభరితంగా ఉండగా, పుట్టినరోజు నాడు విడుదల చేసిన ఒక చిన్న వీడియో పూర్తి యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

nithiinrobinhood.jpg

ఇదిలా ఉండగా ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా చేస్తున్నట్టుగా వినికిడి. ఇంతకు ముందు ఈ సినిమాలో ఇద్దరు పేర్లు ప్రకటించారు, కానీ వారు ఈ సినిమాలో చెయ్యడం లేదు. మొదటిసారిగా ప్రకటించినప్పుడు రష్మిక మందన్న కథానాయిక అని అధికారికంగా అన్నారు, కానీ ఆమె అప్పుడు హిందీ సినిమా చేస్తూ ఉండటంతో ఈ సినిమా నుండి తప్పుకుంది. ఆ తరువాత ఆమె ప్లేస్ లో శ్రీలీలని అధికారికంగా ప్రకటించారు. కానీ నితిన్, శ్రీలీల సినిమా 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్' బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలం అవటంతో, శ్రీలీలని కూడా వద్దనుకున్నారు. ఇప్పుడు ఆమె ప్లేస్ లో రాశి ఖన్నాని తీసుకున్నారని తెలుస్తోంది.

Raashikhannasix.jpg

ఇంకా చిత్రీకరణలో ఈ సినిమా ఉంటూ ఉండగానే విడుదల తేదీని ప్రకటించారు. రాబిన్ హుద్ డిసెంబర్ 20న విడుదల కానుంది. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు ఈ సినిమాకి కలిసి రానున్నాయని అందువలన ఆ తేదీకి ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 03:53 PM