Naresh and Pavitra: నరేష్, పవిత్రలను చూసేందుకు ఎగబడిన జనం.. ఎక్కడంటే?

ABN , First Publish Date - 2023-04-04T16:28:13+05:30 IST

స్టార్ హీరోలు, హీరోయిన్లు ఏవైనా షాప్ ఓపెనింగ్స్‌కు వస్తుంటే జనం తండోపతండాలుగా తరలిరావడం సహజమే. కానీ, నరేష్-పవిత్రలను చూసేందుకు జనం ఎగబడటం ఏమిటి? అసలింతకీ ఇదంతా

Naresh and Pavitra: నరేష్, పవిత్రలను చూసేందుకు ఎగబడిన జనం.. ఎక్కడంటే?
Pavitra and Naresh at Ammavari Temple

గత కొంతకాలంగా వార్తలలో నిలుస్తూ.. హాట్ హాట్ చర్చలకు తావిస్తోన్న సినీ జంట నరేష్, పవిత్ర (Naresh and Pavitra)లను చూసేందుకు జనం ఎగబడ్డారు. స్టార్ హీరోలు, హీరోయిన్లు ఏవైనా షాప్ ఓపెనింగ్స్‌కు వస్తుంటే జనం తండోపతండాలుగా తరలిరావడం సహజమే. కానీ, నరేష్-పవిత్రలను చూసేందుకు జనం ఎగబడటం ఏమిటి? అసలింతకీ ఇదంతా ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా? విషయంలోకి వస్తే..

రీసెంట్‌గా పవిత్ర, నరేష్‌ ఇద్దరూ కలిసి ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరయ్యే నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) కాళ్ల మండలంలోని ఏలూరుపాడు (Elurupadu)కు వెళ్లారు. అక్కడ వీరిద్దరిని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఏలూరుపాడు.. ఇది నరేష్ సొంత గ్రామం. నరేష్ బంధువుల ఇంట్లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యేందుకు నరేష్.. పవిత్రతో కలిసి వెళ్లారు. ఇద్దరూ కలిసి ఆ గ్రామంలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గ్రామంలోని అల్లూరి సీతారామరాజు (Alluri SeetharamaRaju) విగ్రహానికి, ఇంకా అంబేద్కర్ (Ambedkar) విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇలా నరేష్, పవిత్ర సడెన్‌గా తమ వీధుల్లో దర్శనమివ్వడంతో.. అక్కడున్న జనమంతా వారిని చూసేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం నరేష్, పవిత్ర ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Pavitra and Naresh Photos)

Read Also- Poorna: అవును.. తల్లయింది!


Naresh-1.jpg

వీరిద్దరూ గత కొంతకాలంగా కలిసే ఉంటున్న విషయం తెలిసిందే. ఇంకా పెళ్లి అయితే చేసుకోలేదు కానీ.. ఇద్దరూ కలిసే జీవిస్తున్నారు. త్వరలోనే ఇద్దరం పెళ్లి చేసుకుంటామని.. ఇటీవల నరేష్ (VK Naresh) ప్రకటించారు. మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) నుంచి విడాకులు రాగానే.. పవిత్రను పెళ్లి చేసుకునేందుకు నరేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు నరేష్‌కు విడాకులు ఇచ్చేందుకు రమ్య రఘుపతి సుముఖంగా లేదు.

Eluru.jpg

అంతే కాదు, పవిత్రతో నరేష్ పెళ్లిని జరగనీయనంటూ ఆమె ఛాలెంజ్ కూడా చేసింది. ఇలా వీరి మధ్య జరుగుతున్న గొడవలతో.. నరేష్, పవిత్ర ఫేమస్ అయిపోయారు. అలాగే నరేష్, పవిత్ర కలిసి ఎమ్.ఎస్. రాజు (MS Raju) దర్శకత్వంలో ‘మళ్లీ పెళ్లి’ (Malli Pelli) అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఓ వీడియో ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాని స్వయంగా నరేషే నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Srikanth Odela: హీరో కాదు.. ‘దసరా’ దర్శకుడికి నిర్మాత కాస్ట్‌లీ గిఫ్ట్

*Upasana: బెస్ట్ ఫ్రెండ్స్ సమక్షంలో బేబీ షవర్ పార్టీ.. పిక్స్ వైరల్

*SamanthaRuthPrabhu: నాగ చైతన్య, శోభిత డేటింగ్ వార్తల మీద క్లారిటీ ఇచ్చిన సమంత

*Rashmika Mandanna: ‘రెయిన్‌బో’.. రష్మికకు ప్రమోషన్

Updated Date - 2023-04-04T16:36:11+05:30 IST