Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రెండో గీతం ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2023-12-13T20:05:03+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి రెండో సింగిల్ ‘ఓ మై బేబీ’ని మేకర్స్ వదిలారు. మహేష్, శ్రీలీల కాంబోలో వచ్చిన ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రెండో గీతం ఎలా ఉందంటే..
Guntur Kaaram Movie Still

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు. సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ఓ మై బేబీ’ (Oh My Baby)ని విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

పాట విషయానికి వస్తే.. త్రివిక్రమ్-మహేష్ బాబు, త్రివిక్రమ్-థమన్ కాంబినేషన్‌లో పలు చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు వచ్చాయి. ఇప్పుడు ‘గుంటూరు కారం’ కూడా మరో భారీ చార్ట్ బస్టర్ అవుతుందనేలా.. ఇప్పటికే విడుదలైన ‘ధమ్ మసాలా’, తాజాగా విడుదలైన ‘ఓ మై బేబీ’ పాటలు చెబుతున్నాయి. ఈ పాట శీతాకాలపు ఉదయం ఆనందకరమైన మెలోడీని వింటూ పొగలు కక్కే కాఫీ తాగుతున్న అనుభూతిని కలిగిస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఇంతకు ముందు వచ్చిన ‘థమ్ మసాలా’ సాంగ్‌లానే.. ఈ మెలోడీ గీతానికి కూడా అద్భుతమైన స్పందన లభిస్తుందని సంగీత దర్శకుడు ఎస్. థమన్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. (Oh My Baby Lyrical From Guntur Kaaram)


Super-Star.jpg

ఈ మెలోడీ గీతాన్ని టాలెంటెడ్ సింగర్ శిల్పారావు పాడారు. ఈ సోల్ ఫుల్ మెలోడీకి ‘సరస్వతి పుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ రెండు పాటల్లోని ఆహార పదార్థాల పోలిక నేపథ్యం అభిమానులను మరియు ప్రేక్షకులను మరోసారి తెరపై త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబుల మ్యాజిక్ కోసం ఎదురుచూసేలా చేసింది. టాలీవుడ్ క్రష్ శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మీనాక్షి చౌదరి మరో కీలక పాత్ర పోషిస్తోంది. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటిసున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Viraj Ashwin: హీరోగానే కంటిన్యూ చేస్తా.. ఏదైనా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అయితే మాత్రం..?

*******************************

*Srinivas Avasarala: ‘స్మోక్’ అనే షార్ట్ ఫిల్మ్ చూస్తే.. కచ్చితంగా ‘పిండం’ చూస్తారు

************************************

*Ester Noronha: ‘మాయ’.. ఇలాంటి స్టోరీలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలి

**********************************

*Venkatesh: హీరోలందరి ఫ్యాన్స్ అభిమానించే సింగిల్ హీరో..

********************************

Updated Date - 2023-12-13T20:05:04+05:30 IST