సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Heroine-Director: ఇది కదా.. ఇప్పుడు ట్రెండ్!

ABN, First Publish Date - 2023-04-09T18:04:44+05:30

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్‌ అనగానే టక్కున గుర్తుకొచ్చేది హీరో-దర్శకుడు (Hero and Director), హీరో-హీరోయిన్‌ (Hero and Heroine)ల జోడీనే. ఇప్పుడు వీటితో పాటు టాలీవుడ్‌లో హీరోయిన్‌-దర్శకుడి కాంబినేషన్‌ కూడా

Tollywood Star Heroines
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్‌ అనగానే టక్కున గుర్తుకొచ్చేది హీరో-దర్శకుడు (Hero and Director), హీరో-హీరోయిన్‌ (Hero and Heroine)ల జోడీనే. ఇప్పుడు వీటితో పాటు టాలీవుడ్‌లో హీరోయిన్‌-దర్శకుడి కాంబినేషన్‌ కూడా ట్రెండ్‌ సెట్‌ చేస్తోంది. తమకు హిట్‌ ఇచ్చిన దర్శకుల (Directors) చిత్రాల్లో మళ్లీ నటించేందుకు హీరోయిన్లు ఆసక్తి చూపిస్తుంటే.. తమ హిట్‌ చిత్రాల కథానాయికలను (Heroines) తర్వాతి చిత్రాల్లోనూ కొనసాగించడానికి దర్శకులు ఇష్టపడుతున్నారు.

తొలి చిత్ర విజయం హీరో, హీరోయిన్లు, దర్శకులకు ఇండస్ట్రీలో గుర్తింపుతో పాటు అవకాశాలకు ఎర్రతివాచీ పరుస్తుంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) కెరీర్‌ అందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తెలుగులో తొలిచిత్రం ‘ఛలో’ (Chalo) సక్సెస్‌తో రష్మిక మందన్న టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ సినిమాకు వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకుడు. ‘ఛలో’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ (Bheeshma) చిత్రం ఘన విజయం అందుకొంది. ఇందులో నితిన్‌ (Nithiin) హీరో. ‘భీష్మ’తో వెంకీ, రష్మిక కాంబినేషన్‌ మరోసారి హిట్‌ అనిపించుకుంది. తర్వాత రష్మిక పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు. ‘పుష్ప’తో పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. ఇప్పుడు మరోసారి వెంకీ చిత్రంలో రష్మిక మేజిక్‌ చేయబోతున్నారు. నితిన్‌ హీరోగా వెంకీ రూపొందిస్తున్న చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. రష్మిక-వెంకీ ((Venky and Rashmika Mandanna) కాంబినేషన్‌కు హ్యాట్రిక్‌ హిట్‌ ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

‘మంగళవారం’తో మరోసారి

‘ఆర్‌ఎక్స్‌ 100’ (RX 100) చిత్రంతో కుర్రకారుపై వలపు బాణాలను సంధించారు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput). తొలిచిత్రంతోనే సూపర్‌హిట్‌ దక్కడంతో ఆమె అగ్రతారగా నిలదొక్కుకుంటుందనుకున్నారు. కానీ హీరోయిన్‌ రేసులో పాయల్‌ వెనుకబడ్డారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత ఆమె నటించిన చిత్రాలేవీ బాక్సాఫీసు దగ్గర ప్రభావం చూపలేదు. ఆ చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి (Ajay Bhupathi)కి కూడా నిరాశే ఎదురైంది. ఆయన దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ‘మహాసముద్రం’ (Maha Samudram) ప్రేక్షకులను నిరాశపరిచింది. దర్శకుడిగా తిరిగి తన సత్తా చాటడానికి ఆయన ‘మంగళవారం’ (Mangalavaram) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మరోసారి ‘ఆర్‌ఎక్స్ 100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ కాంబినేషన్‌ వీరిద్దరికీ గత వైభవం తెస్తుందేమో చూడాలి. (Ajay Bhupathi and Payal Rajput)

తెలుగులో అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత (Samantha) డేట్లు దొరకడం అంత సులువు కాదు. పలువురు అగ్ర దర్శకులు ఆమెను తమ సినిమాల్లో నటింపచేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్రహీరోలు సైతం సమంతతో జత కట్టేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ సమంత దృష్టంతా తను అంగీకరించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంపైనే. గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ (Shaakuntalam) ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌ దేవరకొండ సరసన ఆమె ‘ఖుషి’ (Kushi) చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరు ‘మహానటి’ (Mahanati) చిత్రంలో జంటగా కనిపించారు. ‘ఖుషి’ చిత్రానికి దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana). ఆయన సమంతతో ‘మజిలీ’ (Majili) చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో వీరిద్దరి కాంబినేషన్‌ (Shiva Nirvana and Samantha)లో ‘ఖుషి’ సెట్టయింది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల్లోనే కాదు వెబ్‌సిరీస్‌ల ఎంపికలోనూ సమంత ఇదే తరహాలో సాగుతున్నారు. ‘ది ఫ్యామిలీ మాన్‌ 2’ (The Family Man 2) సిరీస్‌తో నెగిటివ్‌ ఛాయలున్న పాత్రలోనూ ఆమె ప్రేక్షకుల్ని మెప్పించారు. రాజ్‌ అండ్‌ డీకే ద్వయం తెరకెక్కించిన ఆ సిరీస్‌లో సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ సక్సెస్‌ ఇచ్చిన ఉత్సాహంతో రాజ్‌ అండ్‌ డీకే తదుపరి ప్రాజెక్ట్‌ ‘సీటాడెల్‌’ సిరీస్‌కు సమంత పచ్చజెండా ఊపారు. ఆమె లీడ్‌రోల్‌లో నటిస్తున్న ఈ సిరీస్‌ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఇందులో ఆమె యాక్షన్‌రోల్‌లో కనిపించనున్నారు.


ముచ్చటగా మూడోసారి

ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత వీరరాఘవ’ (Aravinda Sametha Veeraraghava) చిత్రంతో మొదలైన త్రివిక్రమ్‌ (Trivikram), పూజాహెగ్డే (Pooja Hegde) కాంబినేషన్‌ కొనసాగుతోంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌ (Allu Arjun) ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోనూ పూజాను కథానాయికగా తీసుకున్నారు త్రివిక్రమ్‌. ఆ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఇప్పుడు మూడోసారి వీరి కాంబినేషన్‌ (Trivikram and Pooja Hegde) సెట్టయింది. ప్రస్తుతం మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ (SSMB28) పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌పై ఉంది.

ప్రేమకథలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంలో దర్శకుడిగా అట్లీది (Atlee) అందెవేసిన చేయి అనే చెప్పాలి. తొలి చిత్రం ‘రాజా రాణి’ (Raja Rani)తో హిట్‌కొట్టి పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఆ చిత్రంలో నయనతార తన స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి నటించారు. ఆమె నటనకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత అట్లీ తెరకెక్కించిన ‘బిగిల్‌’ (Bigil) చిత్రంలోనూ నయనతార (Nayanthara) కథానాయికగా నటించారు. ఆ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మళ్లీ ఇన్నాళ్లకు అట్లీ, నయనతార (Atlee and Nayanthara) కాంబినేషన్‌ కుదిరింది. వీరి కలయికకు బాలీవుడ్‌ చిత్రం వేదికవడం విశేషం. షారూఖ్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘జవాన్‌’ (Jawan) చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లను పక్కనపెట్టి ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా తీసుకున్నారు. హిందీలోనూ అట్లీ, నయన్‌ కాంబినేషన్‌ హిట్‌ కొడుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

*********************************

*NT Ramarao: రాయలుగా రాజసం ఒలికించారు

*Vijay Sethupathi: బంకమట్టిలా నిల్చున్నాను అంతే.. నన్ను ఆయనే మలిచాడు

*Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్

*Shruti Haasan: అందుకే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో చేశా..

*Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

Updated Date - 2023-04-09T18:04:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!