Gogineni Prasad: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి

ABN , First Publish Date - 2023-09-13T21:17:14+05:30 IST

తెలుగు చలనచిత్ర ప్రముఖ నిర్మాత గోగినేని ప్రసాద్ (73).. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు కన్నుమూశారు. ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం’ మరియు నందమూరి బాలకృష్ణతో ‘పల్నాటి పులి’ వంటి చిత్రాలను ఆయన నిర్మించారు.

Gogineni Prasad: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి
Gogineni Prasad

తెలుగు చలనచిత్ర ప్రముఖ నిర్మాత గోగినేని ప్రసాద్ (73).. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు కన్నుమూశారు. ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం’ మరియు నందమూరి బాలకృష్ణతో ‘పల్నాటి పులి’ వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న గోగినేని ప్రసాద్.. బుధవారం హైదరాబాద్‌, కొండాపూర్‌లో ఉన్న తన ఇంటి నందు మృతి చెందారు.

నిర్మాత గోగినేని ప్రసాద్‌కు ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా నందు స్థిరపడినట్లుగా తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానం నందు గోగినేని ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించబడతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.


gogineni-Prasad.jpg


ఇవి కూడా చదవండి:

============================

*Chota K Naidu: ‘పెదకాపు 1’లో జెండాకర్ర పాతే సీన్.. నేను గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది

*************************************

*A R Rahman: రెహ్మాన్‌కు మద్దతు

************************************

*Dil Raju: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా..

************************************

*Samyuktha Menon: క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’‌లో సంయుక్త ఫస్ట్ లుక్ వదిలారు

***********************************

Updated Date - 2023-09-13T21:17:14+05:30 IST