Thalapathy Vijay: ఒకే ఒక్క సిట్టింగ్‌లో.. మరో టాలీవుడ్ దర్శకుడితో విజయ్ మూవీ!

ABN , First Publish Date - 2023-04-19T15:04:20+05:30 IST

విజయ్ మరో తెలుగు దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లుగా కోలీవుడ్, టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.. ఆ దర్శకుడె ఎవరంటే..

Thalapathy Vijay: ఒకే ఒక్క సిట్టింగ్‌లో.. మరో టాలీవుడ్ దర్శకుడితో విజయ్ మూవీ!
Kollywood Star Hero Vijay

కోలీవుడ్‌లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా దూసుకెళుతోన్న హీరో ఇళయదళపతి విజయ్ (Ilayathalapathy Vijay. భారీ బడ్జెట్, హయ్యస్ట్ రెమ్యూనరేషన్.. ఇలా ఏ కేటగిరీ చూసినా విజయ్ టాప్ ప్లేస్‌లోనే తన సత్తా చాటుతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth), అజిత్ (Ajith) వంటి వారు సినిమాలు చేస్తున్నా.. విజయ్ సినిమాల అంత ఊపు అయితే వారి చిత్రాలకు రావడం లేదు. దీంతో విజయ్‌తో సినిమా కోసం కోలీవుడ్ నుంచే కాకుండా టాలీవుడ్ నుంచి సైతం నిర్మాతలు ఎగబడుతున్నారు. రీసెంట్‌గా టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు ‘వారిసు’ (Dil Raju Varisu) పేరుతో విజయ్‌తో ఓ సినిమాని చేసిన విషయం తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి.. హిట్టు చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ్ మరో తెలుగు దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లుగా కోలీవుడ్, టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

టాలీవుడ్​లో వెంటవెంటనే రెండు హిట్లు ఇచ్చి ఫుల్​ ఫామ్​లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)తో ‘క్రాక్’ (Krack), నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna)తో ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) వంటి రెండు వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో గోపీచంద్ మలినేని స్టార్ డైరెక్టర్​గా మారిపోయారు. ఇప్పుడు గోపీచంద్ మలినేనితో సినిమాలు చేసేందుకు పెద్ద హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో గోపీచంద్ మలినేని తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందనేలా వార్తలు వైరల్ అయ్యాయి. చిరంజీవిని కలిసి కథ కూడా చెప్పినట్లుగా టాక్ వచ్చింది. అయితే ఇప్పటివరకు ఆయన తర్వాతి చిత్రానికి సంబంధించి ఎటువంటి ప్రకటనా రాలేదు. తాజాగా ఇళయ దళపతి విజయ్‌కి గోపీచంద్ (Vijay and Gopichand Malineni Combo) ఒక కథ చెప్పినట్లుగా టాక్ బయటికి వచ్చింది.

Gopichand.jpg

గోపీచంద్ మలినేని చెప్పిన కథ విని.. సింగిల్ సిట్టింగ్​లోనే సినిమాకి ఓకే చెప్పారట విజయ్. ఒక బలమైన పాయింట్‌తో హై ఓల్టేజ్ అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుందని అంటున్నారు. ‘వారిసు’ లానే ఈ సినిమా కూడా ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుందనేలా టాక్ నడుస్తోంది. అలాగే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ నిర్మించనుందట. పూర్తి కథ రెడీ అయిన వెంటనే సెట్స్‌పైకి వెళదామని గోపీచంద్‌కి విజయ్ మాటిచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్ ‘లియో’ (Leo) చిత్రంలో నటిస్తున్నారు. అన్నీ బాగుంటే.. ‘లియో’ తర్వాత విజయ్ నటించే చిత్రం గోపీచంద్ మలినేనిదే కావచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ కాంబోలో సినిమాకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. త్వరలో.. అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే వినిపిస్తున్న వార్తల ప్రకారం తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*OG: అఫీషియల్.. పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరంటే..

*Tollywood: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ కార్యాలయాల్లో ఐటీ దాడులు

*Taapsee Pannu: సౌత్ సినీ ఇండస్ట్రీని ఇంత చీప్‌గా తీసేసిందేంటి?

*Trisha: కార్తీతో కెమిస్ట్రీపై.. త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - 2023-04-19T15:04:22+05:30 IST