Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. మోహన్ బాబు ఫ్యామిలీ
ABN, Publish Date - Jan 12 , 2026 | 11:41 AM
ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు విష్ణు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ప్రముఖ నటుడు మోహన్ బాబు (Manchu Mohan Babu), ఆయన కుమారుడు మంచు విష్ణు (Vishnu) సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ఈ తెల్లవారుజామున వీఐపీ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.
దర్శణానంతం టీటీడీ (TTD)అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామి వారిని దర్శఙంచుకున్న వారిలో మోహన్ బాబు భార్య నిర్మలతో పాటు విష్ణు శ్రీమతి వెరోనికా, నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరికి సంభంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.