Yash: ముంబైలో స్థలం కొన్న యశ్.. ఖరీదు ఎంతో తెలుసా?
ABN, Publish Date - Jun 05 , 2026 | 09:54 AM
కన్నడ స్టార్ యశ్ అలీబాగ్లో కిహిమ్ బీచ్ సమీపంలో కోట్ల విలువైన స్థలాన్ని కొనుగోలు చేశారు.
‘కేజీఎఫ్’ (KGF) చిత్రాలతో టాప్ స్ఠార్గా ఎదిగి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కన్నడ హీరో యశ్ (Yash ) ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. బడాబాబులు ఉండే చోట తను కూడా ఒక ఎకరం పైగా స్థలాన్ని కొని ఇప్పుడు అక్కడ ఓ విలాసవంతమైన భవంతిని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఆ స్థలం ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 24 కోట్లు. అలీబాగ్లో కిహిమ్ బీచ్కి సమీపంలో ఉంది ఈ స్థలం. గత ఐదేళ్లుగా అలీబాగ్ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతోంది.
ఇప్పటికే అక్కడ షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ, రణ్వీర్ సింగ్లకు విలాసవంతమైన విల్లాలు ఉన్నాయి. తన కలల ఇంటిని త్వరలో అక్కడ కట్టుకుని తను కూడా వారి సరసన చేరనున్నారు యశ్.
ఇవి కూడా చదవండి
వారణాసి.. ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందా?
Vijay: ‘జననాయకన్’ విడుదలపై సందిగ్ధత.. డిస్ట్రిబ్యూటర్ల డబ్బు వెనక్కి ఇచ్చేందుకు నిర్మాత సిద్ధం?
Rashmika Mandanna: ఆ పాత్రలో నటించేందుకు.. ముందు భయపడ్డా...