సూర్య‌.. బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజ్‌లు

ABN , Publish Date - May 29 , 2026 | 11:38 AM

కరుప్పు (Karuppu) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన సూర్య, ఇప్పుడు అదే జోష్‌తో తన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు.

suriya

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేశారు. కరుప్పు (Karuppu) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన సూర్య, ఇప్పుడు అదే జోష్‌తో తన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ వార్త వింటే సూర్య ఫ్యాన్స్ ఖచ్చితంగా డబుల్ ఖుషీ అవుతారు. సూర్య అనగానే మనకు వైవిధ్యమైన పాత్రలు గుర్తొస్తాయి. అయితే ఈసారి ఆయన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు రాబోతున్నారు.

సార్, లక్కీ భాస్కర్ వంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా గురువారం నాడు మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ అనౌన్స్‌మెంట్ చేశారు. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విశ్వనాథ్ అండ్ సన్స్ (Viswanath and Sons) థియేటర్లలో సందడి చేయనుంది. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా జూలైలోనే విడుదల చేయాలని భావించారు. కానీ, బిజినెస్ సమీకరణాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్లే కాస్త ఆలస్యంగా, ఆగస్టు కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.


స్వాతంత్య్ర‌ దినోత్సవ లాంగ్ వీకెండ్‌ను ఈ సినిమా ఖచ్చితంగా క్యాష్ చేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏంటంటే.. ఇందులో సూర్య లుక్! ఇప్పటికే విడుదలైన సూర్య వింటేజ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. పాత రోజులను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఆయన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఒక ప్యూర్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్, ప్రేమలు బ్యూటీ మమితా బైజు నటిస్తోంది. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

వీరితో పాటు సీనియర్ నటీమణులు రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంటే నటనకు స్కోప్ ఉన్న బలమైన పాత్రలతో డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ కథను సిద్ధం చేశారన్నమాట. ఇక ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. అగ్ర నటీనటులతో పాటు టాప్ క్లాస్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే నిమిష్ రవి విజువల్స్ అందిస్తుండగా, స్టార్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. బంగ్లాన్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

ఇవి కూడా చదవండి:

ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!

Updated Date - May 29 , 2026 | 02:18 PM