Pithapuramlo: మహేష్చంద్ర దర్శకత్వంలో ‘పిఠాపురంలో’
ABN, Publish Date - Nov 04 , 2025 | 01:35 PM
మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. (Pitapuramlo) ‘అలా మొదలైంది’ అనేది ఉపశీర్షిక. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య తారాగణంగా ఈ చిత్రం రూపొందింది. చిత్రీకరణ పూర్తి అయింది
తొలి చిత్రం ‘ప్రేయసి రావే’తోనే దర్శకునిగా తన సత్తా చాటుకున్నారు మహేష్ చంద్ర (Mahesh Chandra). అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం, రెడ్ అలర్ట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. (Pitapuramlo) ‘అలా మొదలైంది’ అనేది ఉపశీర్షిక. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య తారాగణంగా ఈ చిత్రం రూపొందింది. మహేష్ చంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు మహేష్చంద్ర మాట్లాడుతూ 'కుటుంబ భావోద్వేగాలు కలగలిసిన ప్రేమకథ ఇది. ఇందులో మూడు జంటల ప్రేమకథలు చూడొచ్చు. ముగ్గురు తండ్రుల పెంపకాల్లోని లోటుపాట్లనీ చూడొచ్చు. ప్రేక్షకులు ఏదో ఒకరకంగా ఈ కథతో కనెక్ట్ అవుతారు. ఈమధ్య కాలంలో ‘పిఠాపురం’ అనేది ఎంతలా మారుమోగిందో అందరికీ తెలిసిందే. ఆ పిఠాపురం నేపథ్యంలోనే సినిమా అంతా సాగుతుంది. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో 28 రోజులు, హైదరాబాద్లో 15 రోజులు, గోవాలో 6 రోజులు చిత్రీకరణ జరిపాం. ఇందులో మొత్తం మూడు పాటలు ఉంటాయి. గోవాలో ఒక పాటను, హైదరాబాద్లో సెట్వేసి ఇంకో పాటను, సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్లో మరో పాటను చిత్రీకరించాం. దర్శకునిగా నాకు జీవితాన్ని ప్రసాదించిన రామానాయుడు గారి స్ఫూర్తితో కథను నమ్మి, ఎక్కడా వేస్టేజ్ లేకుండా ఈ సినిమా తీశాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని తెలిపారు.
ALSO READ: Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్ ఎవర్ని దింపారంటే..
Phoenix: విజయ్ సేతుపతి కొడుకు కోసం మెగాఫోన్ పట్టిన అనల్ అరసు
Mastiii 4 : నవ్వులు పూయిస్తున్న మస్తీ 4 ట్రైలర్