Kantara Chapter 1: కాంతార సెట్ లో ప్రమాదం.. క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం
ABN, Publish Date - Jun 15 , 2025 | 07:34 PM
కన్నడ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty)ని ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చిన సినిమా కాంతార(Kantara).
Kantara Chapter 1: కన్నడ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty)ని ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చిన సినిమా కాంతార(Kantara). చిన్న సినిమాగా రిలీజ్ అయినా కాంతార పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకుంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు. ఇక ఈ సినిమా హిట్ తరువాత రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ ను ప్రకటించారు. ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో కానీ, అప్పటి నుంచి షూటింగ్ సెట్ లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. టెక్నీషయన్స్, సెట్ వర్కర్స్ ఇలా ఎవరో ఒకరు మృత్యువాత పడుతున్నారు.
ఇక ఈ సినిమాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే తాజాగా కాంతార చాప్టర్ 1 షూటింగ్ లో భారీ పడవ ప్రమాదం జరిగిందని ఉదయం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిందని, ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు రిషబ్శెట్టి కూడా దానిలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని, ఈ ఘటనలో కెమెరాతో పాటు పలు పరికరాలు నీటి పాలయ్యాయని చెప్పుకొచ్చారు. దీంతో రిషబ్ శెట్టికి ఏదైనా జరిగిందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Madhoo Bala: బలవంతంగా లిప్ కిస్ పెట్టించారు.. చివరకు
అయితే తాజాగా ఈ వార్తలపై హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. ఉదయం నుంచి వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చింది. చిత్రీకరణలో భాగంగా జలాశయం వద్ద ఒక సెట్ వేశామని, అప్పుడే పెద్దగా గాలి రావడంతో ఆ సెట్ దెబ్బతిన్నట్లు తెలిపారు. పడవ ప్రమాదం అంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని, సెట్ లో అలాంటిది ఏది జరగలేదని చెప్పుకొచ్చారు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటున్నా కూడా రిషబ్ అస్సలు తగ్గకుండా ఈ సినిమా షూటింగ్ ను ఫినిష్ చేస్తున్నాడు. అక్టోబర్ 2 న కాంతార రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో రిషబ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.