సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

A.R.Rahman: కచేరి రద్దు... 55 వేల పరిహారం..

ABN, Publish Date - Jun 10 , 2025 | 07:09 PM

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కు బ్యాడ్ టైం నడుస్తోంది. పర్సనల్, ప్రొఫెషనల్ గా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. తాజాగా మరో న్యూస్ తో వార్తల్లోకి ఎక్కడం చర్చనీయాంశంగా మారింది.

మ్యూజిక్ సెన్సేషన్ ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్‌ (A.R. Rahman)కు చేదు అనుభవం ఎదురైంది. చెన్నైలో జరగాల్సిన మ్యూజిక్ కాన్స‌ర్ట్‌ రద్దు కావడంతో ఓ అభిమాని కోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన కోర్టు.... 55 వేల నష్ట పరిహారం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.


2023 చెన్నైలో మరక్కుమ నెంజం (Marakkuma Nenjam) పేరుతో భారీ మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్ నిర్వహించేందుకు రహమాన్ ప్లాన్ చేశాడు. ఆగస్టు 12న జరగాల్సిన షో.... చెన్నైలో భారీ వర్షాల కారణంగా రద్దు అయింది. అయితే సెప్టెంబర్ 10న గ్రాండ్ గా ఈవెంట్ ను నిర్వహించారు. ఆగ‌స్ట్ లో టికెట్ కొన్న అభిమాని... సెప్టెంబర్ కాన్స‌ర్ట్‌కి హాజరు కావొచ్చని నిర్వాహకులు చెప్పారు. దీంతో అన్నా నగర్‌కు చెందిన ఆ వ్యక్తి... 10వేలు పెట్టి టికెట్ తీసుకున్నాడు. షో జరిగిన రోజు హెవీ ట్రాఫిక్ తోడు ఈవెంట్ కు సంబంధించిన వివరాలు నిర్వాహకులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో హాజరు కాలేకపోయాడు. దీంతో ఆవేదన చెందిన అభిమాని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.

డబ్బులు పెట్టి టికెట్ కొన్నా, ఈవెంట్ ను చూడలేకపోయానని ఫిర్యాదు లో వెల్లడించాడు. తన అభిమాన సంగీత దర్శకుడిని చూడాలని చాలా ఆశపడ్డానని... కానీ వారి నిర్లక్ష్యం వల్ల వెళ్ళలేకపోయానని... తన పేరు, ప్రతిష్ఠను కించపరిచినందుకు పరిహారంగా రూ. 10 లక్షలతో పాటు టిక్కెట్ డబ్బులు వడ్డీతో కలిపి చెల్లించాలని ఫిర్యాదులో కోరాడు. ఆ మేరకు కోర్టును ఆశ్రయించాడు. ఫిర్యాదును విచారించిన చెన్నై జిల్లా వినియోగదారుల కమిషన్.. రెహమాన్ కాన్స‌ర్ట్‌ని నిర్వహించిన ACTC సంస్థకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో పిటిషనర్ కు 50 వేలు పరిహారంగా చెల్లించడంతో పాటు 5 వేలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. టోటల్ గా బాధితుడికి రూ. 55,000 చెల్లించాలని కమిషన్ తీర్పునివ్వడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jun 10 , 2025 | 07:09 PM