Aditi Rao Hydari: నిర్మాతల కోసం హీరామండీ లేడీస్ ఆటాపాటా
ABN, Publish Date - Jun 07 , 2025 | 10:16 AM
సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన 'హీరామండీ' వెబ్ సీరిస్ గత యేడాది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ జరుపుకుని మంచి స్పందన పొందింది. ఇప్పుడు సీజన్ 2 రూపొందించే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు.
బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటీమణులు అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari), మనీషా కోయిరాలా (Manisha Koirala), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) , రిచా చద్దా (Richa Chadha) నటించిన వెబ్ సీరిస్ 'హీరా మండీ: ది డైమండ్ బజార్' (Heeramandi). ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ (Sanjay Leela Bhansali) రూపొందించిన ఈ వెబ్ సీరిస్ గత యేడాది నెట్ ఫ్లిక్స్ ల స్ట్రీమింగ్ అయ్యింది. దీనికి వీక్షకుల నుండి మంచి స్పందన లభించింది. స్వాతంత్ర్యానికి పూర్వం 1940లో లాహోర్ లోని కళావంతుల జీవితాల ఆధారంగా దీనిని రూపొందించారు. ఎప్పుడైతే తొలి సీజన్ సక్సెస్ అయ్యిందో దాంతో దీనికి సీక్వెల్ తీసే ప్రయత్నాలను సంజయ్ లీలా బన్సాలీ మొదలు పెట్టారు. ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసి, సెట్స్ పైకి ఈ సీరిస్ ను తీసుకు రాబోతున్నారు.
వేశ్యలుగా కనిపించే లాహోర్ మహారాణుల జీవన గాథపై తొలి సీజన్ లో ఫోకస్ పెట్టిన సంజయ్ లీలా బన్సాలీ ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. ఈ రెండో సీజన్ లో హీరామండీ లేడీస్ వేశ్య వృత్తిని వదలిపెట్టి, లాహోర్ నుండి బాలీవుడ్ వస్తారట. ఈసారి నవాబుల కోసం కాకుండా వీరు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కోసం ఆటాపాటా మొదలు పెడతారట. సంజయ్ లీలా బన్సాలీ ఈ రెండో సీజన్ కోసం ఆసక్తికరమైన కథనే రాసుకున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. మరి మొదటి సీజన్ అంత విజయాన్ని ఈ రెండో సీజన్ పొందుతుందో లేదో చూడాలి.
Also Read: Devika & Danny : దేవిక అండ్ డానీ వెబ్ సీరిస్ రివ్యూ
Also Read: Sri Sri Sri Raajavaru Review: నార్నె నితిన్ మొదటి సినిమా ఎలా ఉందంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి