సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Border 2: చిత్రీకరణలో ప్రధాన తారాగణం

ABN, Publish Date - Jun 17 , 2025 | 01:26 PM

బోర్డర్ 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం పూణె డిఫెన్స్ అకాడమిలో జరుగుతోంది. ప్రధాన తారాగణం ఈ చిత్రీకరణలో పాల్గొంటోంది.

ప్రముఖ దర్శక నిర్మాత జె.పి. దత్తా (J.P. Dutta) తెరకెక్కించిన ఎపిక్ వార్ ఫిల్మ్ 'బోర్డర్' (Border) 1997లో ఘన విజయాన్ని సాధించింది. ఎంతోమంది నటీనటులకు ఈ సినిమా లైఫ్ టైమ్ ఫేమ్ అండ్ నేమ్ సంపాదించిపెట్టింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఆగస్ట్ 15, జనవరి 26 తేదీలలో గల్లీగల్లీలో మారుమ్రోగుతూనే ఉంటాయి.


గత కొన్నేళ్ళుగా బాలీవుడ్ లో పలు చిత్రాలకు సీక్వెల్స్ రావడం మొదలైంది. అయితే హారర్ చిత్రాలకు, ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ కు సీక్వెల్ వచ్చినట్టుగా వార్ బేస్డ్ మూవీస్ కు, థాట్ ప్రొవోకింగ్ మూవీస్ కు సీక్వెల్ పెద్దగా రాలేదు. కానీ ఇప్పుడు 'బోర్డర్ -2' (Border -2) తెరకెక్కుతోంది. ఈ సినిమాను భూషణ్ కుమార్ (Bhushan Kumar), నిధి దత్తా (Nidhi Dutta) నిర్మిస్తున్నారు. దీనికి శివ్ చానన, బినయ్ గాంధీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'బోర్డర్ -2' సినిమాను అనురాగ్ సింగ్ (Anurag Singh) డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూణె లోని నేషనల్ డిఫెన్స్ అకాడమిలో జరుగుతోంది.


ఆర్మీ జవాన్లలోని దేశభక్తిని వెండితెరపై ఆవిష్కరించబోతున్న ఈ సినిమాను టి. సీరిస్ సంస్థ ప్రెజెంట్ చేస్తోంది. జవాన్ల వీరోచిత పోరాటాన్ని, సాహసాన్ని, వారిలోని సమర్పణ భావాన్ని, బలిదానాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. సన్ని డియోల్, దిల్ జిత్ దొసాంజ్, అహన్ శెట్టి, వరుణ్ ధావన్ ప్రస్తుతం పూణె లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 23న విడుదల కానుంది.

Also Read: Nayanthara: మెగా 157.. నయన్‌ నడక కలిసింది

Also Read: Bollywood: వెండితెరపైకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బయోపిక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 17 , 2025 | 01:26 PM