Allu Arjun: నాగబాబు పోస్టు అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిందా?

ABN , Publish Date - May 14 , 2024 | 11:51 AM

అల్లు అర్జున్ నంధ్యాల పర్యటన కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య అంతరాన్ని దూరం చేసే విధంగా వివాదాస్పదంగా మారింది. మెగా స్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ పట్ల కొంచెం కోపంగా వున్నారని వినిపిస్తోంది, దానికితోడు చిరంజీవి సోదరుడు నాగబాబు 'ఎక్స్' లో చేసిన పోస్ట్ ఇటువంటి వార్తలు నిజమే అన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే నాగబాబు పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది

Allu Arjun: నాగబాబు పోస్టు అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిందా?
Chiranjeevi and Allu Aravind, (inset) Allu Arjun

మెగా కుటుంబంలో ఈమధ్య కొంచెం మనస్పర్థలు వచ్చినట్టుగా కనపడుతోంది. మెగా కుటుంబం అంటే, చిరంజీవి సోదరుల మధ్య కాదు, చిరంజీవి కుటుంబం, అల్లు కుటుంబం మధ్య అంతరాలు పెరిగినట్టుగా కనపడుతోంది. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ నంధ్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లి అక్కడ ప్రజలని తన స్నేహితుడికి ఓటు వేయాల్సిందిగా అడిగారు. అల్లు అర్జున్ నంధ్యాల పర్యటన వివాదం కూడా యింది. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఈ పర్యటన చేసినందుకు, అక్కడ అల్లు అర్జున్ ని చూడటానికి వందలాది మంది ప్రజలు వచినందువలన శాంతి భద్రలకు ఆటంకం కలిగింది అని అల్లు అర్జున్ పై ఒక కేసు కూడా నమోదైంది. (Nagababu post on 'X' indirectly says about Allu Arjun)

Mega Brothers

అయితే ఈ పర్యటనపై అల్లు అర్జున్, తను హైదరాబాదులో ఓటు వేసే సమయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఒకటి అల్లు అర్జున్ తెలుసుకోవాలి అని మెగా అభిమానులు అంటున్నారు. శిల్పా రవి ఎంతటి స్నేహితుడైనా, పవన్ కళ్యాణ్ దగ్గరి బంధువు కాబట్టి ముందు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఉండాల్సింది అని అంటున్నారు. (Nagababu post on 'X' indicated that Mega Family is not happy with Allu Arjun's Nandhyal tour) అదీ కాకుండా, రామ్ చరణ్, అతని తల్లి సురేఖతో కలిసి పిఠాపురం పవన్ కళ్యాణ్ ని కలవడానికి వెళ్లిన రోజే అల్లు అర్జున్ కూడా తన పర్యటన పెట్టుకోవటం మరింత వివాదం అయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అల్లు అర్జున్ కి కుటుంబ సభ్యులు నంద్యాల పర్యటనకి ఇప్పుడు వద్దు అని చెప్పారని, అయినా కూడా వినిపించుకోకుండా అల్లు అర్జున్ కావాలనే వెళ్లారని కూడా ఒక వార్త నడుస్తోంది.

alluaravind3.jpg

అల్లు అర్జున్ నంధ్యాల పర్యటనని కొంచెం బ్యాలన్స్ చెయ్యడానికే అన్నట్టుగా రామ్ చరణ్, సురేఖలతో అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లారు. అది అటు మెగా కుటుంబ సభ్యులకి, ఇటు అభిమానులకి చాలా క్లియర్ గా అర్థం అవుతోంది. అల్లు అరవింద్ ఎంతగా బ్యాలన్స్ చేద్దామని అనుకున్నా, అల్లు అర్జున్ చేసిన పని మాత్రం మెగాస్టార్ కుటుంబంలో ఎవరికీ నచ్చలేదు అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతోంది అనే విషయం బయటకి వచ్చింది. పైగా నంద్యాలలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తనని ఎవరూ పిలవలేదని, తనే కావాలని తన స్నేహితుడు కోసం వచ్చానని అనటం, అంతరాలని మరింత పెంచింది అని కూడా ఒక టాక్ నడుస్తోంది. (Nagababu post on 'X' going viral as it is pointed out about Allu Arjun says Netizens)

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఒక ట్వీట్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్, తన స్నేహితుడు కోసం కూడా ఒక ట్వీట్ చేశారు. మరి దగ్గరి బంధువు దగ్గరకి ముందు వెళ్లకుండా, స్నేహితుడి దగ్గరకి వెళ్లడం మెగా కుటుంబం, అభిమానుల్లో చర్చనీయాంశం అయింది. మెగా స్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకి అంత సంతోషంగా లేరని కూడా తెలిసింది.

nagababuoperationvalentine.jpg

ఈ నేపథ్యంలో మెగా సోదరుడు నాగబాబు 'ఎక్స్' లో చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించి అన్నారు అని కూడా అభిమానులు, నెటిజన్స్ అంటున్నారు. ఇంతకీ నాగబాబు ఏమన్నారు అంటే, "మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...!," అని పోస్ట్ చేశారు. ఇందులో ఎవరి పేరు చెప్పకపోయినా, ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించి అన్నట్టుగానే వుంది అని నెటిజన్స్ అంటున్నారు. (Differences arise between Mega Star Chiranjeevi and his brother-in-law Allu Aravind because of Allu Arjun's visit to Nandhyal)

ఇంతకుముందు ఎన్నో సార్లు ఇలాంటి వార్తలు ఈ రెండు కుటుంబాలపై వచ్చినా అప్పట్లో ఖండించేవారు. మరి ఈసారి కూడా ఈ రెండు కుటుంబాలు ఖండిస్తాయా, లేక సైలెంట్ గా వూరుకుంటాయా అనేది వేచి చూడాల్సిందే!

Updated Date - May 14 , 2024 | 11:56 AM