Mega Family: అందరూ ఒకే చోట.. ఆ రూమర్‌కు చెక్‌! 

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:59 AM

ఏ పండుగ వచ్చినా మెగా ఫ్యామిలీ అంతా ఓ చోట చేరి సెలబ్రేట్‌ చేసుకుంటారు. తాజాగా క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మెగా ఫ్యామిలీ యంగ్‌ హీరోలతోపాటు కజిన్స్‌ అందరూ ఒక్కచోటకు చేరారు. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్  కూడా ఒకే   ఫ్రేములో కనిపించారు.

Mega Family: అందరూ ఒకే చోట.. ఆ రూమర్‌కు చెక్‌! 

సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా క్రిస్మస్‌ సెలబ్రేషన్స్ కు  సంబంధించిన ఫొటోలే దర్శనమిస్తున్నాయి. సినీ సెలబ్రిటీలు క్రిస్మస్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఏ పండుగ వచ్చినా మెగా ఫ్యామిలీ (mega Family) అంతా ఓ చోట చేరి సెలబ్రేట్‌ చేసుకుంటారు. తాజాగా క్రిస్మస్‌ (Christmas Celebrations) వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మెగా ఫ్యామిలీ యంగ్‌ హీరోలతోపాటు కజిన్స్‌ అందరూ ఒక్కచోటకు చేరారు. రామ్‌ చరణ్‌ (Ram charan), అల్లు అర్జున్  (Allu arjun) కూడా ఒకే   ఫ్రేములో కనిపించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దాంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులు మాంచి కిక్‌గా ఫీలవుతున్నారు. ఎందుకంటే కొద్ది రోజులు క్రితం బన్నీకి, చరణ్‌కు మధ్య సరైన బాండింగ్‌ లేరని రూమర్స్‌ పుట్టుకొచ్చాయి. అలాగే ఈ ఏడాది చరణ్‌ పుట్టినరోజున అల్లు అర్జున్‌ విషెస్‌ చెప్పకపోవడం..  బన్నీకి నేషనల్‌ అవార్డు వచ్చినప్పుడు చరణ్‌.. సోషల్‌ మీడియాలో  శుభాకాంక్షలు చెప్పకపోవడంతో వీరిద్దరి మధ్య గ్యాప్‌ ఉందని భావించారు. కానీ తాజాగా క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో వీళ్లు కలిసి కనిపించడంతో ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్టయింది. ఈ ఫొటోల్లో వరుణ్‌ తేజ్‌, నిహారిక, ఉపాసన, అల్లు స్నేహ, లావణ్య త్రిపాఠి, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌ కూడా ఈ పిక్‌లో ఉన్నారు. ఈ ఫోటోలను బన్నీ, వరుణ్‌తేజ్‌ ఇనస్టాగ్రామ్‌లో షేర్‌ చేసి, ఫ్యామిలీ టైమ్‌ అని రాసుకొచ్చారు. 

Updated Date - Dec 26 , 2023 | 11:59 AM