Manchu Vishnu: చిరుకి పద్మ విభూషణ్, అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్, జై బాలయ్య.. ‘నవతిహి’ విశేషాలివే!

ABN , Publish Date - Mar 23 , 2024 | 04:57 PM

తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గతంలో వజ్రోత్సవం చేసినట్టు ఈసారి ‘నవతిహి ఉత్సవం’ చేయబోతున్నారు. త్వరలో మలేషియాలో ‘నవతిహి’ పేరిట చేయబోయే ఈ చారిత్రాత్మక ఈవెంట్ గురించి ప్రకటించడానికి శనివారం.. హైదరాబాద్ పార్క్ హయత్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Manchu Vishnu: చిరుకి పద్మ విభూషణ్, అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్, జై బాలయ్య.. ‘నవతిహి’ విశేషాలివే!
MAA Navatihi Utsavam Event Press Meet

తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గతంలో వజ్రోత్సవం చేసినట్టు ఈసారి ‘నవతిహి ఉత్సవం’ (Navatihi Utsavam) చేయబోతున్నారు. త్వరలో మలేషియాలో ‘నవతిహి’ (Navatihi) పేరిట చేయబోయే ఈ చారిత్రాత్మక ఈవెంట్ గురించి ప్రకటించడానికి శనివారం.. హైదరాబాద్ పార్క్ హయత్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artist Association) అధ్యక్షుడు విష్ణు మంచు (Vishnu Manchu) ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఈసీ మెంబర్స్, పలువురు మలేషియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా నటి మధుమిత శివబాలాజీ వ్యవహరించారు. 1932 నుంచి తెలుగు సినిమా గొప్పదనం గురించి, 1993లో మొదలైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి తెలిపి.. గత రెండేళ్లలో ‘మా’ (Maa) చేసిన పనులని వివరించారు మధుమిత శివబాలాజి. అనంతరం విష్ణు మంచు ఈ ప్రెస్ మీట్‌ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మలేషియా నుంచి వచ్చిన అడ్వైజర్ ధాతుక్ కమలనాథన్ (Kamalanathan) మాట్లాడుతూ.. విష్ణు మంచు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయనతో పలు సార్లు మాట్లాడాను. ఆయనతో మాట్లాడిన ప్రతిసారి ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) గురించి, ఇందులో సభ్యులకు చేయాల్సిన పనుల గురించి, ఇన్సూరెన్స్‌ల గురించి, మెడికల్ గురించి, ఆర్టిస్ట్‌ల పిల్లల ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేవారు. ఆయన ఎప్పుడు కలిసినా ‘మా’ గురించే మాట్లాడేవారు. మేము ఈ ‘మా’ ఈవెంట్‌ను మలేషియాలో గ్రాండ్‌గా ఆర్గనైజ్ చేయబోతున్నాం. మలేషియా గవర్నమెంట్‌కి ధన్యవాదాలు. మలేషియా టూరిజంని ‘మా’ అందరికీ పరిచయం చేయబోతున్నందుకు విష్ణు మంచుకి ధన్యవాదాలని అన్నారు.

మలేషియా టూరిజం డైరెక్టర్ ఇండియా, శ్రీలంక ప్రతినిధి రాజౌది అబ్దుల్ రాహిమ్ (Razaidi Abdul Rahim) మాట్లాడుతూ.. మలేషియా టూరిజం డైరెక్టర్ తరపున నేను ఇక్కడకు వచ్చాను. జూలైలో ‘మా’ ఈవెంట్ మలేషియాలో జరగబోతుంది. ఈ ఈవెంట్‌తో మలేషియా కొలాబరేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. విష్ణు మంచుకి ధన్యవాదాలు. అందరూ మలేషియాకు వచ్చి ఎంజాయ్ చేయండి. ఇండియా - మలేషియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. టూరిజం మలేషియా ఈ ప్రోగ్రాంకి సపోర్ట్ చేస్తున్నందుకు మా టూరిజం ఇండస్ట్రీకి కూడా చాలా ఉపయోగపడుతుంది, మలేషియాలో కలుద్దామని తెలిపారు.


Maa-Event.jpg

విష్ణు మంచు (Vishnu Manchu) మాట్లాడుతూ.. మలేషియా నుంచి ఇక్కడికి వచ్చిన కమల్ నాథ్‌కి, టూరిజం డిపార్ట్‌మెంట్ వారికి ధన్యవాదాలు. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ చేయాలని నిర్ణయించుకున్నాం. తెలుగు సినీ పరిశ్రమ మొదలైనప్పటి నుండి ఎంతోమంది నటీనటులను గుర్తుచేసుకుంటూ ఈ ఈవెంట్‌ని గ్రాండ్‌గా, సక్సెస్ ఫుల్‌గా చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం వాయిదా పడుతూ వస్తుంది. అలాగే ఈ ప్రోగ్రాం నుంచి ‘మా’ కోసం ఫండ్ రైజింగ్ కూడా చేద్దామనుకున్నాం. రెండేళ్ల క్రితం నేను మలేషియాలో షూట్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే కమల్ నాథే నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ‘మా’ తరపున బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్‌ను జూలైలో మలేషియాలో చేయబోతున్నాము. డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సినీ పరిశ్రమ పెద్దలతో‌ మాట్లాడి డేట్‌ను ప్రకటిస్తాం. అందరూ ఈ ఈవెంట్‌కి వచ్చేలా చేస్తాము. ఇప్పుడు తెలుగు సినిమాకు గోల్డెన్ ఎరా నడుస్తోంది. తెలుగు నటీనటులుగా మేమంతా గర్విస్తున్నాము. తెలుగు సినిమా ఘన కీర్తిని తెలిపేలా ఈ ‘నవతిహి’ ఉత్సవం చేయబోతున్నాము. అమితాబ్, అనీల్ కపూర్.. పలువురు నటులను సినిమాలకు తెలుగువారే పరిచయం చేశారు. మెగాస్టార్ చిరంజీవిగారికి పద్మ విభూషణ్ రావడం చాలా గొప్ప విషయం. మన జై బాలయ్య అనే మాట ఎక్కడికి వెళ్లినా వినిపిస్తుంది. నా బ్రదర్ అల్లు అర్జున్ ఫస్ట్ తెలుగు హీరోగా నేషనల్ అవార్డ్ తీసుకొచ్చాడు. ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్. మహేష్, రాజమౌళి‌గారి సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా కాబోతుంది. రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు. కీరవాణి‌గారు ఫస్ట్ ఆస్కార్ పొందిన తెలుగువారు. ఇలా ఎన్నో సాధిస్తున్నాము. అందుకే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవటం కరెక్ట్ టైమ్ అని భావిస్తున్నాము. మలేషియా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘మా’లో దాదాపు 800కి పైగా ఆర్టిస్టులు ఉన్నారు. కానీ అందులో కొంతమందే బాగా సెటిల్ అయినవాళ్లు. మిగిలిన వాళ్లకు మేము అండగా నిలబడటానికి ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నాము. ఇప్పటికే మేము చేస్తున్న మెడికల్ భీమా చాలా మందికి సపోర్ట్‌గా నిలిచింది. అన్ని సినీ పరిశ్రమలతో మాట్లాడాను. ఈ ఈవెంట్‌కి వేరే పరిశ్రమ నటీనటులు కూడా కొంతమంది రాబోతున్నారని తెలిపారు.

మలేషియాలో లోకల్ ఈవెంట్ ఆర్గనైజర్ MC ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎడ్విన్ ఆనందరాజ్ (Edwin Anandaraj) మాట్లాడుతూ.. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన విష్ణు మంచుకి ధన్యవాదాలు. మలేషియాలో ఇప్పటికే మేము చాలా ఈవెంట్స్ చేశాము. ఈ ఈవెంట్‌ని మలేషియాలో గ్రాండ్‌గా చేస్తామని అన్నారు. ఈ ఈవెంట్‌కి ఫండ్ రైజింగ్‌కి సపోర్ట్ చేస్తున్న ఆక్టోపస్ స్టూడియో రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. మేము గ్లోబల్ ఈవెంట్స్ చేస్తాం. ప్రపంచములోనే అతి పెద్ద ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈవెంట్ జరగబోతుంది. ఇదంతా మంచు విష్ణు వల్లే సాధ్యమవుతుంది. ‘మా’ కోసం విష్ణు మంచు కష్టపడేతత్వం నాకు బాగా నచ్చిందని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Allu Arjun: మరో రికార్డ్ బద్దలైంది.. ఐకాన్‌స్టార్‌ని ఆపతరమా..

************************

*Thalakona: కశ్మీర్ యాపిల్‌‌లా ఉండే అప్సరా రాణి.. కశ్మీర్ మిర్చి‌లా..

*********************

Updated Date - Mar 23 , 2024 | 04:57 PM