Pankaj Tripathi: మీర్జాపూర్‌ నటుడు ఇంట విషాదం..

ABN , Publish Date - Apr 21 , 2024 | 11:04 AM

సూపర్‌హిట్‌ సిరీస్‌ మీర్జాపూర్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన బావ రాకేష్‌ తివారీ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.

Pankaj Tripathi: మీర్జాపూర్‌ నటుడు ఇంట విషాదం..


సూపర్‌హిట్‌ సిరీస్‌ మీర్జాపూర్‌ (mirzapur) నటుడు పంకజ్‌ త్రిపాఠి (Pankaj Tripathi) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన బావ రాకేష్‌ తివారీ (Rakesh tiwari) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ యాక్సిడెంట్‌లో అతని సోదరి సబితా తివారీ (Sabitha tiwari) తీవ్రంగా గాయపడ్డారు.   జార్ఖండ్‌లోని ధనబాద్‌లో చోటు (road accident) చేసుకుంది. డిల్లీ-కోల్‌కతా నేషనల్‌ హైవేపై సాయంత్రం ఐదు గంటల సమయంలో  సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  ఈ దంపతులు ఇద్దరు  బీహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లా నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ధనబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. రాకేశ్‌ తివారీని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్దారించారు. పంకజ్‌ త్రిపాఠి సోదరి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 21 , 2024 | 11:06 AM