మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tripti Dimri: ఈ 'యానిమల్' భామ ఇంకో పెద్ద ప్రాజెక్ట్ చేజిక్కించుకుంది

ABN, Publish Date - Feb 21 , 2024 | 04:14 PM

'యానిమల్' ఫేమ్ త్రిప్తి డిమ్రికి వరసగా హిందీలో అవకాశాలు వస్తున్నాయి, ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్ చేజిక్కించుకుంది. విద్యాబాలన్, కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'భూల్ భూలయ్యా 3' లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది.

Tripti Dimri

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన 'యానిమల్' సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో ఒక చిన్న పాత్రలో నటించిన త్రిప్తి డిమ్రీ ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపొయింది. ఆమెని కూడా నేషనల్ క్రష్ అని అందరూ అన్నారు, అంటే అంత పెద్దగా ఆమె పేరు మారుమోగిపోయింది. 'యానిమల్' సినిమా విడుదలవ్వకముందు అంతగా పరిచయం లేని ఉత్తరాఖండ్ కి చెందిన త్రిప్తి ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆమె పేరు అందరి నోట్లో నానిపోయింది. (Animal fame Tripti Dimri gets another big project)

ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ చూసిన ఆమెకి, ఆనంద్ తివారీ దర్శకత్వంలో వస్తున్నా 'మేరే మెహబూబ్ మేరే సనమ్‌'లో విక్కీ కౌశల్‌తో నటించే అవకాశం దక్కింది. అలాగే ఇంకో ప్రాజెక్ట్ 1990ల నాటి మసాలా చిత్రం 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' లో రాజ్‌కుమార్ రావుతో కలిసి నటించే అవకాశాం కూడా త్రిప్తి దక్కించుకుంది. (Tripti Dimiri in Bhool Bhulaiyaa 3)

ఈ రెండు సినిమాలు కాకుండా ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్ త్రిప్తి చేతిలోకి వచ్చింది. 'భూల్ భూలయ్యా 3' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో త్రిప్తి డిమ్రీని ఆ చిత్ర నిర్వాహకులు తీసుకున్నారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటిస్తుండగా, విద్యాబాలన్ మంజూలికగా కనిపించనుంది. సీనియర్ నటీమణి మాధురీ దీక్షిత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. ఇప్పుడు త్రిప్తి డిమ్రిని కూడా తీసుకుంటున్నట్టుగా సామాజిక మాధ్యమాల ద్వారా చిత్ర నిర్వాహకులు, విద్యా బాలన్ అధికారికంగా ప్రకటించారు. (Vidya Balan welcomes Animal girl Tripti Dimri into Bhool Bhulaiyaa 3 world)

ఈ 'భూల్ భూలయ్యా' హిందీ సినిమా మొదటి పార్టులో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ మరియు అమీషా పటేల్ ప్రధాన పాత్రలు చెయ్యగా, రెండో పార్టులో కార్తీక్ ఆర్యన్, టబ్బు, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ రెండు పార్టులు మంచి విజయం సాధించటంతో ఇప్పుడు ఈ మూడో పార్ధుకి కూడా శ్రీకారం చుట్టారు. అనీస్ బాజ్మీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు, ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా ఈ సినిమాని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:

Tripti Dimri: 'యానిమల్' లో ఒక్క సన్నివేశానికి ఏకంగా నేషనల్ క్రష్ అయిపోయిందిగా...

Animal: ఎవరీ తృప్తి డుమ్రి, అంత బోల్డ్ గా ఎలా నటించింది? ఆమె గురించే ఎక్కువ ఆరా...

Tripti Dimri : అతి తక్కువ మంది సమక్షంలో ఆ సన్నివేశాలు తీశాం!

Updated Date - Feb 21 , 2024 | 04:26 PM