Tripti Dimri: 'యానిమల్' లో ఒక్క సన్నివేశానికి ఏకంగా నేషనల్ క్రష్ అయిపోయిందిగా...

ABN , First Publish Date - 2023-12-14T15:07:46+05:30 IST

'యానిమల్' సినిమా విడుదలయ్యాక త్రిప్తి డిమ్రీకి ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ల కొలదీ ఫాలోవర్స్ పెరిగారు, అలాగే 'ఎక్స్' (ట్విట్టర్) లో కూడా ఫాలోవర్లును పెంచుకోవాలని త్రిప్తి ఏమి చేసిందో చూడండి...

Tripti Dimri: 'యానిమల్' లో ఒక్క సన్నివేశానికి ఏకంగా నేషనల్ క్రష్ అయిపోయిందిగా...
Tripti Dimri is the most searching name in recent times

ఇప్పుడు సెలబ్రిటీ పేర్లలో ఎక్కువగా ఎవరికోసం వెతుకుతున్నారు అంటే త్రిప్తి డిమ్రీ (TriptiDimri) అని అంటున్నారు. ఈమె పేరు కొన్ని రోజులవరకు అంతగా ఎవరికీ తెలియదు, కానీ 'యానిమల్' #Animal సినిమా విడుదలయ్యాక ఈమీ కోసం తెగ వెతుకుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈమె ఆ సినిమాలో కథానాయికగా నటించలేదు, రెండో సగంలో మాత్రమే చిన్న పాత్రలో కనపడుతుంది. మరి ఈమెకి ఎందుకు క్రేజ్ అంటే, ఆమె చేసిన సన్నివేశం అటువంటిది మరి.

triptidimriwinter.jpg

త్రిప్తి డిమ్రీ 'యానిమల్' లో కథానాయకుడు రణబీర్ కపూర్ తో ఒక నగ్న సన్నివేశంలో నటించి సంచలనం సృష్టించింది. అంతకు ముందు ఆమె కొన్ని హిందీ సినిమాలు, అలాగే వెబ్ సిరీస్ చేసినా ఆమెకి ఇంతగా పేరు రాలేదు, కానీ ఈ 'యానిమల్' సినిమాలో చేసిన ఆ ఒక్క సన్నివేశానికి ఆమెకి విశేష గుర్తింపు వచ్చేసింది. అందరూ ఆమె ఎవరు ఏంటి అనేది వెతుకులాట ప్రారంభించారు.

triptidimriwinterpic.jpg

'యానిమల్' సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న (RashmikaMandanna) వేసింది, ఆమెని అందరూ 'నేషనల్ క్రష్' #NationalCrush అంటారు. అయితే ఈ సినిమా విడుదలయ్యాక, రష్మిక తో పాటు ఈ త్రిప్తి డిమ్రీని కూడా అందరూ 'నేషనల్ క్రష్' అని అంటున్నారు. నేషనల్ క్రష్ చెల్లెలు అని, ఇలా ఏవేవో పేర్లు పెట్టి ఈమె ఎక్కడ ఏమి మాట్లాడినా అది ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

త్రిప్తి డిమ్రీకి ఈ సినిమా విడుదలయ్యాక వేలల్లో ఫాలోవర్స్ పెరిగారని తెలుస్తోంది. ఆమెకి ఇంతకు ముందు సాంఘీక మాధ్యమంలో తక్కువగా ఫాలోవర్స్ ఉంటే, ఈ సినిమా విడుదలయ్యాక ఒక్కసారిగా పెరిగిపోయారని తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఈమెకి ఇప్పుడు 30 లక్షల 70 వేలుకి పైగా (3.7 మిలియన్) ఫాలోవర్లు వున్నారు. ఇంతకు ముందు ఒక మిలియన్ లోపు ఉండేవారు.

triptidimriuttarakhand.jpg

త్రిప్తి డిమ్రీ ఈ సినిమా విడుదలైన తరువాత పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు, అందులో తనకి తెలుగు నటుడు ఎన్టీఆర్ (NTR) తో పని చెయ్యడం అంటే ఇష్టం అని చెప్పారు. ఇదిలా ఉండగా, దర్శకుడు సందీప్ వంగా (SandeepVanga) తను తరువాత ప్రభాస్ (Prabhas) తో తీయబోయే 'స్పిరిట్' సినిమాలో త్రిప్తి డిమ్రీ కథానాయకురాలు అని ప్రచారం కూడా జరుగుతోంది.

త్రిప్తి డిమ్రీ కూడా ఇప్పుడు తన గ్లామరస్ ఫోటోలు ఇప్పుడు చాలా పోస్ట్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ను పెంచుకున్న త్రిప్తి ఇప్పుడు 'ఎక్స్' (ట్విట్టర్) లో కూడా పెంచుకోవాలని చూస్తోంది.

Updated Date - 2023-12-14T15:22:45+05:30 IST