Megastar Chiranjeevi: మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్

ABN , First Publish Date - 2023-06-23T22:34:30+05:30 IST

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి.. రక్తదానం, నేత్రదానం పిలుపుతో ఎందరో ప్రాణాలను కాపాడుతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన స్టార్ క్యాన్సర్ సెంటర్ వారితో కలిసి సినిమా ఇండస్ట్రీలోని కార్మికులకు ఉచితంగా క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలను నిర్వహించబోతున్నట్లుగా తెలియజేశారు.

Megastar Chiranjeevi: మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్
Megastar Chiranjeevi

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (CCT) స్థాపించి.. రక్తదానం, నేత్రదానం పిలుపుతో ఎందరో ప్రాణాలను కాపాడుతున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. కరోనా టైమ్‌లో, ఆ తర్వాత చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టం అని తలుపుతడితే చాలు.. తన వంతు సహకారం, సహాయం అందిస్తానని చిరంజీవి (Chiranjeevi) మాటిచ్చారు. ఆ మాట మీద నిలబడుతూ.. ఇప్పుడెందరికో ఆయన సహాయాన్ని అందిస్తున్నారు. ఇటీవల సీసీటీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు, జర్నలిస్ట్‌లకు, అభిమానులకు లైఫ్‌లాంగ్ బెనిఫిట్స్ అందేలా యోధ కార్డ్స్ అందించిన మెగాస్టార్.. ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రానికి శ్రీకారం చుట్టారు. స్టార్ క్యాన్సర్ సెంటర్‌‌ (Star Cancer Center)తో కలిసి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేయనున్నట్లుగా.. చిరంజీవి ప్రకటించారు.

రీసెంట్‌గా స్టార్ క్యాన్సర్ సెంటర్‌‌ను ప్రారంభించిన మెగాస్టార్.. అక్కడి డాక్టర్స్‌తో సినీ కార్మికులకు, జర్నలిస్ట్‌లకు, అభిమానులకు క్యాన్సర్‌ని ముందస్తుగా గుర్తించేలా టెస్ట్‌లు చేయగలిగితే.. అందుకు ఎంత ఖర్చు అయినా తనే భరిస్తానని ప్రకటించారు. ఆ క్యాన్సర్ సెంటర్ వారు కూడా చిరు కోరికను తీర్చేలా.. పక్కా ప్రణాళికతో సిద్ధమవడంతో.. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి.. క్యాన్సర్ స్క్రీనింగ్‌ టెస్ట్‌ల‌కు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

Megastar.jpg

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌ టెస్ట్‌‌‌లను జూలై‌లో మూడు ప్రదేశాలలో చేయబోతున్నట్లుగా మెగాస్టార్ తెలియజేశారు. జూలై 9న హైదరాబాద్, 16న వైజాగ్, 23న కరీంనగర్‌లో రోజుకు వెయ్యి మంది చొప్పున వివిధ క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అభిమానులు, సినీ కార్మికులు, జర్నలిస్ట్‌లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోనూ, అలాగే ఇకపై కూడా అభిమానులు, సినీ కార్మికులు, జర్నలిస్ట్‌లకు ఉచిత వైద్య పరీక్షలు చేయడమే కాకుండా.. చికిత్సకు అయ్యే ఖర్చు విషయంలోనూ కొంత సబ్సిడీ అందేలా స్టార్ క్యాన్సర్ సెంటర్‌వారు, తను కలిసి ఓ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లుగా మెగాస్టార్ చెప్పుకొచ్చారు. దీనిపై ప్రస్తుతం మాట్లాడుకుంటున్నామని, త్వరలోనే సినీ కార్మికులకు, జర్నలిస్ట్‌లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామని, దాని ద్వారా భవిష్యత్‌లోనూ చికిత్సలు చేయించుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగానూ, అలాగే క్యాన్సర్‌పై అవగాహన కల్పించేలా కొన్ని లఘు చిత్రాలను కూడా రూపకల్పన చేయబోతున్నట్లుగా చిరంజీవితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ మన్నె గోపీచంద్ (Manne Gopichand), డాక్టర్స్ సాయి, బిపిన్‌‌లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*KP Chowdary: ‘కబాలి’ నిర్మాత కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. చిక్కుల్లో అషు రెడ్డి

**************************************

*BoyapatiRAPO: మరింత దగ్గరకి మాస్ బీభత్సం.. ఈ మధ్య కాలంలో ఇలాంటి అనౌన్స్‌మెంట్ అయితే రాలే..


**************************************

*Sreeleela: దేవాలయం కంటే గొప్పది.. ఆ విషయం బాలయ్యకి కూడా తెలియదు.


**************************************

*Spy Trailer Talk: స్వాతంత్య్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు, లాక్కునేది. ఇదెవరు చెప్పారో తెలుసా?


**************************************

Updated Date - 2023-06-23T22:39:10+05:30 IST