Janam: రాజకీయ నాయకులతో పాటు జ‌నానికి కూడా చురకలు వేస్తున్నారట..

ABN , First Publish Date - 2023-09-25T19:29:37+05:30 IST

విఆర్‌పి క్రియేష‌న్స్ ప‌తాకంపై శ్రీమ‌తి పి. ప‌ద్మావ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో సుమ‌న్, అజ‌య్ ఘోష్, ప్ర‌గ్య‌ నైనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘జ‌నం’. వెంక‌ట ర‌మ‌ణ ప‌సుపులేటి స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను సోమవారం ఫిలిం చాంబ‌ర్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. పొలిటీషియ‌న్స్‌తో పాటు జ‌నానికి కూడా ఈ చిత్రంలో చుర‌క‌లు వేస్తున్నామని దర్శకనిర్మాత తెలిపారు.

Janam: రాజకీయ నాయకులతో పాటు జ‌నానికి కూడా చురకలు వేస్తున్నారట..
Janam Movie Trailer Launch Event

విఆర్‌పి క్రియేష‌న్స్ ప‌తాకంపై శ్రీమ‌తి పి. ప‌ద్మావ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో సుమ‌న్ (Suman), అజ‌య్ ఘోష్ (Ajay Ghosh), కిషోర్, వెంక‌ట ర‌మ‌ణ‌, ప్ర‌గ్య‌ నైనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘జ‌నం’ (Janam). వెంక‌ట ర‌మ‌ణ ప‌సుపులేటి (Venkata Ramana Pasupuleti) స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను సోమవారం ఫిలిం చాంబ‌ర్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ.. ఈ సినిమాని ఒంగోలులో షూటింగ్ చేశాం. ‘నేటి భారతం’ కూడా అక్క‌డే షూటింగ్ జ‌రిగింది. ఆ సినిమా జ్ఞాప‌కాలు క‌ళ్ల ముందు క‌దిలాయి. అదే కోవ‌లో వ‌స్తోన్న చిత్రం ‘జ‌నం’. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న క‌రప్ష‌న్‌తో పాటు అన్యాయాలు, అక్ర‌మాల గురించి ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా చూపించారు. సందేశంతో పాటు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. ఈ త‌రం పిక్చ‌ర్స్ వారి చిత్రాలు ఎలా ఉంటాయో అలా ఈ చిత్రం కూడా ఉంటుంది. ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో ఈ చిత్రం రావ‌డం గొప్ప విష‌యం. ప్ర‌జ‌ల్లో మార్పు రావాల‌ని చెప్పే చిత్రమే ‘జ‌నం’ అని తెలిపారు. (Janam Trailer Launched)


Suman-2.jpg

న‌టుడు అజ‌య్ ఘోష్ మాట్లాడుతూ.. స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల‌పై ఈ చిత్రం రూపొందింది. క‌మ‌ర్షియ‌ల్ అంశాలు కూడా మెండుగా ఉంటాయి. ద‌ర్శ‌కుడు వెంక‌ట ర‌మ‌ణ సినిమా రంగంలో ఎంతో అనుభ‌వం ఉన్న వ్య‌క్తి. అన్నీ తానై ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. జ‌నానికి సంబంధించిన చిత్రం కాబ‌ట్టి బాధ్య‌త‌గా ఈ చిత్రంలో న‌టించా. సుమ‌న్ గారితో ఈ చిత్రంలో న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఒంగోలులో షూటింగ్ చేసిన ప్ర‌తి చిత్రం విజ‌యం సాధించింది. ఆ కోవ‌లో ఈ చిత్రం కూడా ఘన విజ‌యం సాధించడం ఖాయమని అన్నారు.

ద‌ర్శక నిర్మాత ప‌సుపులేటి వెంకట ర‌మ‌ణ మాట్లాడుతూ.. సుమ‌న్‌గారితో ‘దేశంలో దొంగ‌లు ప‌డ్డారు’ చిత్రానికి ప‌ని చేశాను. అప్ప‌టి నుంచి వారితో మంచి ప‌రిచయం ఉంది. టి.కృష్ణ గారి ద‌గ్గ‌ర చాలా చిత్రాల‌కు ప‌ని చేశాను. నేను ఇందులో మాజీ న‌క్స‌లైట్‌గా న‌టించాను. ఇందులో సుమ‌న్‌గారే హీరో. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించారు. జ‌నం చిత్రాన్ని రెండు పార్ట్ లుగా చేస్తున్నా. పార్ట్ 1 షూటింగ్ పూర్త‌యింది. పార్ట్ -2 కూడా త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌వుతుంది. ఇందులో ఉన్న వారు దాదాపు అందులో కూడా ఉంటారు. నిజాయితీకి.. ప్ర‌జాస్వామ్యానికి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే ఈ చిత్రం. మా బేన‌ర్‌లో ఇది మూడో చిత్రం. త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. పొలిటీషియ‌న్స్‌తో పాటు జ‌నానికి కూడా ఈ చిత్రంలో చుర‌క‌లు వేస్తున్నామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*P Vasu: మా గాడ్ ఫాదర్ ఎన్టీఆరే..

****************************************

*Rambha: ప్లీజ్ ప్లీజ్ స్వామి.. అంటూ దేవుడ్ని ఏం వేడుకుందో చూశారా? వీడియో వైరల్!

****************************************

*Manchu Lakshmi: నా కష్టం.. నా సంపాదన.. నీకేమిరా నొప్పి?.. మంచు లక్ష్మీ ఫైర్!

*****************************************

*Aakasam Dhaati Vasthaava: ‘ఉన్నానో లేనో..’ ఆకట్టుకుంటోన్న మ్యాజికల్ మెలోడీ..

**********************************************

Updated Date - 2023-09-25T19:29:37+05:30 IST