MegaStar Chiranjeevi: చిరంజీవి, డీజే టిల్లు కాంబినేషన్ సినిమా కథ ఎవరిదో తెలిస్తే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2023-06-03T18:35:01+05:30 IST

చిరంజీవి, డీజే టిల్లు ఇద్దరూ కలిపి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి దర్శకుడు కాగా చిరంజీవి కుమార్తె సుష్మిత నిర్మాత. అయితే ఈ సినిమా మలయాళం సినిమా 'బ్రో డాడీ' కి రీమేక్ అని చాలామంది అనుకుంటున్నారు, కానీ అది తప్పు వార్త అని, ఇది ఒరిజినల్ కథ అని, దీన్ని ఒక టాప్ రైటర్ దగ్గర తీసుకున్నారని, ఇంతకీ ఎవరా రైటర్, ఆ వివరాలు చదవండి.

MegaStar Chiranjeevi: చిరంజీవి, డీజే టిల్లు కాంబినేషన్ సినిమా కథ ఎవరిదో తెలిస్తే షాక్ అవుతారు
Chiranjeevi and DJ Tillu Siddhu Jonnalagadda

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi), డీజే టిల్లు అనబడే సిద్ధూ జొన్నలగడ్డ (SiddhuJonnalagadda) లీడ్ యాక్టర్స్ గా కళ్యాణ్ కృష్ణ (KalyanKrishna) దర్శకత్వంలో ఒక సినిమా రూపు దిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల (SushmithaKonidela) నిర్మిస్తున్న సంగతి కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి చాలా వార్తలు వచ్చాయి. అందులో ప్రధానంగా ఈ సినిమా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ (MohanLal), పృథ్వి రాజ్ సుకుమారన్ (PrithvirajSukumaran) నటించిన 'బ్రో డాడీ' (BroDaddy) సినిమాకి రీమేక్ అని, ఆ మలయాళం సినిమా హక్కులు తీసుకొని చిరంజీవి ఇంకో రీమేక్ అధికారికంగా చేస్తున్నారని వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

Chiranjeevi.jpg

అయితే ఆలా అనుకోవడానికి చాలా ఆస్కారం వుంది, ఎందుకంటే చిరంజీవి, డీజే టిల్లు అంటే తండ్రీ కొడుకులుగా వేస్తున్నారు కాబట్టి ఆ 'బ్రో డాడీ' సినిమా అనుకునే ఛాన్స్ వుంది. కానీ ఈ సినిమా 'బ్రో డాడీ' సినిమా ఎంతమాత్రం కాదని ఈ యూనిట్ సభ్యుల తాజా సమాచారం బట్టి తెలుస్తోంది. ఇది తెలుగు కథ అని, ఇందులో కూడా చిరంజీవి, డీజే టిల్లు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారని తెలిసింది.

ఇంతకీ మరి ఈ సినిమా కథ ఎవరిదీ, ఎవరు రాశారు? అంటే అది రవితేజకి (RaviTeja) 'ధమాకా' #Dhamaka లాంటి హిట్ కథ ఇచ్చిన బెజవాడ ప్రసన్న కుమార్ (BezawadaPrasannaKumar) కథ అని తెలిసింది. ఈ కథ ప్రసన్న తనే దర్శకత్వం వహించి, ముందుగా ఒక చిన్న బడ్జెట్ సినిమా తీద్దామని అనుకున్నాడు అని తెలిసింది. అయితే ఈ కథ ఆ నోటా ఈ నోటా చాలామంది నిర్మాతల దగ్గరికి వెళ్ళింది, అందరూ ఈ కథ చాలా సూపర్, ఎవరు చేసిన హిట్ అవుతుంది అన్నారు. ఆలా అందరి నోటా విన్న ఈ కథ ఒకసారి సుష్మిత దగ్గర కూడా ప్రసన్న కుమార్ చెప్పాడని, విన్న వెంటనే సుష్మిత చాలా ఎక్సయిట్ అయి, ఈ కథ నేను తీసుకుంటాను అని వెంటనే అతని దగ్గర కథ తీసుకున్నారని తెలిసింది.

djtillu2.jpg

ఆలా తీసుకున్న కథకి వెంటనే చిరంజీవి, డీజే టిల్లు లను ఫిక్స్ చేసుకొని, దర్శకుడిగా కళ్యాణ్ కృష్ణ ని కూడా తీసుకున్నారు. ఈ కథలో చాలా భాగం తండ్రీ కొడుకుల మీదే నడుస్తుందని, ఇది ఒక హిలేరియస్ కథ అని, చిరంజీవి ఈ కథ తీసుకోవటంతో ఈ సినిమా ఇప్పుడు హై బడ్జెట్ మూవీ అవ్వబోతోందని తెలిసింది. అయితే చిత్ర నిర్వాహకులు ఎందుకో మరి ప్రసన్న కుమార్ కథ అని మాత్రం బయటకి పొక్కకుండా చేశారు. అందుకనే ఇది అందరూ మలయాళం సినిమాకి రీమేక్ అని అనుకుంటున్నారు.

Updated Date - 2023-06-03T18:35:01+05:30 IST